మోడీని కలిసేందుకు నటి మైత్రియా హంగామా, తరలించిన మహిళా పోలీసులు
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడిని కలవాలని తన సమస్యలు ఆయనకు చెప్పాలని కన్నడ నటి మైత్రియా గౌడ నానా హంగామా చేశారు. శుక్రవారం రాత్రి బెంగళూరులోని నేషనల్ కాలేజ్ మైదానంలో నరేంద్ర మోడి బహిరంగ సభ జరిగిన విషయం తెలిసిందే.
నేషనల్ కాలేజ్ మైదానంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడి నేషనల్ కాలేజ్ మైదానం చేరుకునే కొన్ని నిమిషాల ముందు మైత్రియా గౌడ అక్కడ ప్రత్యక్షం అయ్యింది. వీవీఐపి గేట్ దగ్గరకు వెళ్లి తాను మైదానం లోపలికి వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని పోలీసు అధికారులకు చెప్పింది.

తనకు బీజేపీ నాయకుల వలన అనేక సమస్యలు వచ్చాయని, తన సమస్యలను ప్రధాని నరేంద్ర మోడికి దృష్టికి తీసుకు వెళ్లాలని పట్టుబట్టింది. వీవీఐపీ పాస్ లు ఉన్న వారు లోపలికి వెళ్లడానికి తాము అనుమతి ఇస్తామని, పాస్ లు లేకుంటే వెళ్లనివ్వమని అక్కడ విధులలో ఉన్న ఏసీపీ దావూద్ ఖాన్ స్పష్టం చేశారు.
ఆ సమయంలో మైత్రియా గౌడ పోలీసు అధికారులతో వాగ్వివాదానికి దిగింది. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించింది. పరిస్థితి విషమించడంతో మహిళ పోలీసులు వచ్చి మైత్రియా గౌడను అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ కాలేజ్ మైదానం బయటకు తీసుకు వెళ్లి వదిలి పెట్టారు. ఆమె ప్రధాని నరేంద్ర మోడిని కలవడానికి విఫలయత్నం చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications