సంబంధం లేని వ్యక్తి సీఎం ఎలా అవుతారు? శశికళపై గౌతమి, ఆందోళన
తమిళనాట నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సినీ నటి గౌతమి మరోసారి స్పందించారు.
చెన్నై: తమిళనాట నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సినీ నటి గౌతమి మరోసారి స్పందించారు. రాష్ట్రంలో రాజకీయాలు చిందరవందరగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం తమిళనాట ప్రజల తరపున పోరాడే గొంతు లేదని అన్నారు.
ప్రజా భద్రతకు ముప్పువాటిల్లుతుందని ఆమె అన్నారు. తమిళనాడులో రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తి అకస్మాత్తుగా నేను ముఖ్యమంత్రి అయి తీరుతానని ప్రకటించడం ప్రజాస్వామ్యానికే ముప్పు అని ఆమె ఘాటుగా వ్యాఖ్యనించారు.
పార్టీలో కీలక వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి పది శాతం మాత్రమే తాను మాట్లాడానని, 90 శాతం మాట్లాడితే రంగులు బయటపడతాయని చేసిన వ్యాఖ్యలు ఎంత భయంకరమైనవో అర్ధం చేసుకున్నవారికే తెలుస్తుందని ఆమె చెప్పారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కడాన్ని ఏ తమిళుడు అంగీకరించడని అన్నారు.

తమిళ ప్రజలు జయలలితను చూసి ఓట్లు వేశారని, ఆమెకు వేసిన ఓటును తాము అనుభవిద్దామని కొందరు భావిస్తున్నారని శశికళను ఉద్దేశించి పేర్కొన్నారు. బాధ్యతాయుత రాజకీయాలు లేనప్పుడు, ప్రజాసమస్యలు పట్టించుకోనప్పుడు ప్రశ్నించే బాధ్యత పౌరురాలిగా తనకు ఉందని ఆమె స్పష్టం చేశారు.
తాను రాజకీయాల్లోకి వస్తానా? లేదా? అన్నది సమస్య కాదని, వాస్తవాలను పక్కదోవ పట్టించేందుకు లేనిపోని వాదనలు తెరమీదికి తెస్తున్నారని ఆమె మండిపడ్డారు.
జయలలిత ఆసుపత్రిలో ఉండగా ప్రభుత్వం తరపున నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? అని ఆమె ప్రశ్నించారు.
ఒక వైపు జయలలిత తుది శ్వాసవరకు పక్కనే ఉండి సేవలు చేశామని చెప్పుకునేవారు.. ప్రభుత్వాన్ని నడిపించామని కూడా చెబుతున్నారని, అది ఎలా సాధ్యమైందని శశికళను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో ఏం జరగబోతోందోనని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని గౌతమి అన్నారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications