స్టార్ హీరోయిన్నూ వదల్లేదు.. !!
Lok Sabha elections 2024: దేశంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ నెల 19వ తేదీన ప్రారంభం కానుంది. మొత్తం 13 రాష్ట్రాల్లో 89 లోక్సభ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశలో పోలింగ్ ముగుస్తుంది. అదే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
రెండో విడత పోలింగ్ ఈ నెల 26వ తేదీన షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కేరళలోని 20 లోక్సభ నియోజకవర్గాలకు ఒకేదశలో పోలింగ్ ముగస్తుంది. కేరళలోని వాయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచారు కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ.

2019 నాటి ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే విజయం సాధించిన విషయం తెలిసిందే. కేరళ పొరుగునే ఉన్న తమిళనాడులో తొలి విడతలోనే పోలింగ్ పూర్తవుతుంది. మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. ఈ ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే, భారతీయ జనతా పార్టీ పోటీ పడుతున్నాయి.
పోలింగ్ గడువు సమీపించిన నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు మరింత ముమ్మరం అయ్యాయి. వీఐపీల కార్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు ఎన్నికల సిబ్బంది. పోలీసుల సహకారంతో వాటిని విస్తృంగా తనిఖీ చేస్తోన్నారు. ఏ కారును కూడా వదట్లేదు. ప్రముఖుల వాహనాలకూ మినహాయింపేమీ ఉండట్లేదు.
ఈ క్రమంలో కేరళ నుంచి తమిళనాడుకు బయలుదేరి వెళ్లిన ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ కారును కూడా ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తిగత పనుల కోసం తిరుచిరాపల్లికి వెళ్లారామె.
తిరుచిరాపల్లి శివార్లలో ఆమె ప్రయాణిస్తోన్న నంబర్ కేఎల్ 25 9009 రేంజ్ రోవర్ కారును ఎన్నికల సిబ్బంది అడ్డుకున్నారు. కారు మొత్తం తనిఖీ చేశారు. ఆ సమయంలో మంజు వారియర్ డ్రైవింగ్ సీట్లో కనిపించారు. ఎన్నికల సిబ్బందికి సహకరించారు. తనిఖీ అనంతరం ఎన్నికల సిబ్బంది ఆమెతో సెల్ఫీ దిగారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications