నటి బిదిశా అనుమానాస్పద మృతి
న్యూఢిల్లీలో సమీపంలోని గురుగ్రామ్లో తన నటన, సంగీతంతో ఆశేష ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొన్న అసామీ నటి బిదిశా అనుమానాస్పదస్థితిలో మరణించారు.
గురుగ్రామ్: న్యూఢిల్లీలో సమీపంలోని గురుగ్రామ్లో తన నటన, సంగీతంతో ఆశేష ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొన్న అసామీ నటి బిదిశా అనుమానాస్పదస్థితిలో మరణించారు.
సోమవారం ఢిల్లీ శివారులోని గురుగ్రామ్లోని తన ఫ్లాట్లో ఆమె ఉరివేసుకొన్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె మరణంపై కుటుంబసభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలనే ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టారు.
బిదిశా స్వస్థలం గువాహటి. ఆమె చిన్నతనం నుండి సంగీతం, నటనల పట్ల శ్రద్దకనబర్చిన ఆమె, టీనేజీలో ఉండగానే రంగప్రవేశం చేసింది. అసామీ నాటకాలు, సంగీత కార్యక్రమాల ద్వారా పేరు సంపాదించుకొంది. ఇటీవలే విడుదలైన జగ్గా జాసూస్ ద్వారా బాలీవుడ్లోకి ప్రవేశించింది. కెరీర్ కీలక దశలో ఉన్న తరుణంలో బిదిశా మరణవార్త కుటుంబసభ్యులు, అభిమానులను దిగ్బ్రాంతికి గురిచేసింది.
ఏడాది కిందే గుజరాత్కు చెందిన నితీష్ ఝా అనే వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. అయితే నిశీత్ కుటుంబీకులు బిదిశను వేధింపులకు గురిచేయడంతో ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. భర్తతో మాత్రం ఆమె మంచి సంబంధాలను కొనసాగుతున్నాయి. కొద్దిరోజుల ముందే ఆమె భర్తతో కలిసి టూర్కు వెళ్ళింది. బిదిషా మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.