సీఎం పళనిస్వామితో నటి వరలక్ష్మి భేటీ: ఎందుకు? ఏం చర్చించారు?..
సినీ ఇండస్ట్రీ సహా సామాన్యులెవరైనా లైంగిక వేధింపులకు గురైతే.. వారికి అండగా నిలిచేందుకు ఇటీవల సేవ్ శక్తి అనే వ్యవస్థను వరలక్ష్మి ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై చర్చించడానికి ఆమె సీఎంను కలుసుకున్నారు. సీఎం
చెన్నై: తమిళ నటి వరలక్ష్మి ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామిని కలుసుకోవడం ప్రాధానత్యను సంతరించుకుంది. అన్నాడీఎంకె రాజకీయాలు అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈ భేటీ చోటు చేసుకోవడం కొత్త చర్చలకు తావిచ్చింది. అయితే ఈ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని భేటీ అనంతరం వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది.
ఇద్దరు ప్రేమికులు మళ్ళీ కలిసారా? తండ్రిని కాదని ప్రేమికుడికే హీరోయిన్ ఓటు ??
సినీ ఇండస్ట్రీ సహా సామాన్యులెవరైనా లైంగిక వేధింపులకు గురైతే.. వారికి అండగా నిలిచేందుకు ఇటీవల సేవ్ శక్తి అనే వ్యవస్థను వరలక్ష్మి ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై చర్చించడానికి ఆమె సీఎంను కలుసుకున్నారు. సీఎం పళనిస్వామితో భేటీ అనంతరం వరలక్ష్మి.. పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు.

లైంగిక వేధింపుల కారణంగా మహిళలు మానసికంగానూ, శారీరకంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా కోర్టులు ఏర్పాటు చేయాలని సీఎంను కోరినట్లు వరలక్ష్మి తెలిపారు. ప్రత్యేకంగా మహిళల కోసమే పనిచేసే ఈ కోర్టుల్లో 6నెలల్లోగా తుది తీర్పు వచ్చేలా చూడాలని సీఎంకు విన్నవించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా 60వేల సంతకాలు చేసిన సేవ్ శక్తి పిటిషన్ను ఆమె సీఎంకు అందించారు.
కాగా, గతంలో మలయాళీ భామ భావన కిడ్నాప్ కు గురై లైంగిక వేధింపులను ఎదుర్కొన్న సమయంలో.. తానూ లైంగిక వేధింపులకు గురయ్యానని వరలక్ష్మి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మహిళా రక్షణ కోసం సేవ్ శక్తి అనే సంస్థను ఆమె ఏర్పాటు చేశారు.
ఈ సంస్థ ద్వారా లైంగిక వేధింపులను ఎదుర్కొనే బాధితులకు రక్షణగా నిలవాలని ఆమె భావిస్తున్నారు.ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు.. మహిళా రక్షణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే ఉద్దేశంపై ఆమె సీఎంతో చర్చించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications