ఆ వ్యక్తి ఎవరో చెప్పాలి: అద్వానీ 'ఎమర్జెన్సీ'పై శివసేన
ముంబై: మరోసారి అత్యవసర పరిస్థితి తలెత్తబోదని చెప్పలేనన్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారో చెప్పాలని శివసేన సోమవారం నిలదీసింది. తమ పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది.
ఎమర్జెన్సీ గురించి అద్వానీ తనకున్న ఆందోళనను వెల్లడించారంటే ఆయన తప్పకుండా ఎవరినో వేలెత్తి చూపిస్తున్నట్లేనని, ఆయన చెప్పిన ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ పరిస్థితికి సంబంధించిన భయాలను ఎలా తొలగించాలన్నది కూడా ముఖ్య విషయమేనని చెప్పారు.

మన దేశంలో రాజకీయ పరిణామ క్రమాన్ని, ఎత్తుపల్లాలను స్వయంగా చూసిన అద్వానీ ప్రస్తుతం ప్రధాన స్రవంతి రాజకీయాల్లో లేకపోయినా ఆయనను బీజేపీ గానీ, మీడియ గానీ పక్కనపెట్టే పరిస్థితి ఉండదని సామ్నాలో పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ తలెత్తి ప్రజాస్వామ్యాన్ని అణిచివేయగలదని నలభై సంవత్సరాల తర్వాత అద్వానీకి ఎందుకు అనిపించిందని ప్రశ్నించింది. కాగా, అద్వానీ నాలుగు రోజుల క్రితం ఎమర్జెన్సీ మళ్లీ తలెత్తే అవకాశాలు కొట్టిపారేయలేమని చెప్పిన వ్యాఖ్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications