సరైన సమయంలోనే అద్వానీ నిష్ర్కమణ : కాంగ్రెస్ తీరు మార్చుకోవాలన్న శివసేన
న్యూఢిల్లీ : బీజేపీ నుంచి ఆ పార్టీ అగ్రనేత అద్వానీని తప్పించి, సరైన సమయంలో బీజేపీ గౌరవించిందని శివసేన అభిప్రాయపడింది. ఎన్నికల్లో అద్వానీకి టికెట్ ఇవ్వక, ఆయనతోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటించేలా బీజేపీ పెద్దలు వ్యవహరించారని తన పత్రిన సామ్నా ఎడిటోరియల్ లో రాసింది. ఒకవిధంగా ఇది మంచిదేనని పేర్కొన్నది.

75 ఏళ్ల దాటిన వారికి విశ్రాంతి
ఈ ఎన్నికల్లో బీజేపీ కొత్త స్ట్రాటజీ అమలు చేసింది. 75 ఏళ్లు దాటిన వారికి టికెట్ ఇవ్వబోమని ప్రకటించింది. కొత్తవారికి అవకాశం ఇచ్చే ప్రక్రియలో భాగంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టంచేసింది. దీంతో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కల్ రాజ్ మిశ్రా, ఇతర నేతలు ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు తమ విధుల నుంచి రిటైర్ కావాల్సిందేనని .. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం అద్వానీ లాంటి నేతలకు భావి నాయకుల మధ్య సముచిత గౌరవం లభిస్తుందని అభిప్రాయపడింది.

రామ్ లక్ష్మణ్ : వాజ్ పేయి, అద్వానీ
దేశంలో బీజేపీ బలోపేతం కోసం వాజ్ పేయి, అద్వానీ విశేషంగా కృషి చేశారని సామ్నా రాసింది. 2 సీట్ల నుంచి అధికారం చేపట్టేందుకు వారు అహోరాత్రులు శ్రమించారని గుర్తుచేసింది. వారిద్దరూ రామ, లక్ష్మణులు పార్టీ ఉన్నతికి రేయింబవళ్లు కష్టపడ్డారని పేర్కొన్నది. వాజ్ పేయి చనిపోయాక .. అద్వానీ మీడియా ముందుకు రాలేని పరిస్తితి ఏర్పడింది. వారిద్దరి స్థానాన్ని మోదీ, అమిత్ షా భర్తీ చేస్తున్నారని తెలిపింది. అలాగే అద్వానీ భీష్ముడిగా అభివర్ణించింది. అతని సలహాలు, సూచనలను శివసేన ఎల్లవేళలా పాటించిందని వెల్లడించింది.

కాంగ్రెస్ పై విమర్శలు
కాంగ్రెస్ పార్టీలో మాత్రం వ్యక్తి పూజ ఉంటుందని విమర్శించారు. అక్కడ గాంధీ నెహ్రూ వారసులకు తప్ప మిగతావారికి చోటు ఉండదని పేర్కొన్నది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావుకు ఎలాంటి గౌరవం దక్కిందో మనకు తెలుసు. అలాగే సీతారాం కేసరిని ఎలా పక్కన పెట్టారో భరతజాతికి తెలుసు అని ఎడిటోరియల్ లో రాసింది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో












Click it and Unblock the Notifications