తల్లీకూతుళ్లతో అఫైర్: తల్లిని చంపేసిన ప్రబుద్ధుడు
ముజఫర్నగర్: తల్లీకూతుళ్లతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ ప్రబుద్ధుడు చివరకు తల్లిని పీక పిసికి హత్య చేశాడు. తొలుత తల్లితో అతను వైవాహికేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె కూతురును ముగ్గులోకి దింపి వశపరుచుకున్నాడు. చివరకు తల్లిని హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా బిలాస్పూర్ గ్రామంలో జరిగింది.
రామ్వీర్ అనే వ్యక్తి ఓ వితంతువుతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత ఆమె 18 ఏళ్ల కూతురు మీద కన్నేశాడు,. నెమ్మదిగా ప్రేమ పేరుతో ఆమెను వలలోకి లాగాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చారు.

తన కూతురు అతడికి కూతురు వరుస అవుతుందని, ఇలా చేయవద్దని ఆమె తల్లి మొరపెట్టుకుంది. పెళ్లికి నిరాకరించింది. దాంతో అతనుడు అనుజ్, సతీష్, అర్జున్ అనే ముగ్గురు సహచరులను వెంటబెట్టుకుని ఆ వితంతువును పీక పిసికి హత్య చేశాడు.
ఆ తర్వాత బిలాస్పూర్ గ్రామ సమీపంలో ఢిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారిపై ఆమె మృతదేహాన్ని పడేశాడు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications