24ఏళ్ల తర్వాత ఒక్కటైన మాజీ సిఎంలు లాలూ, నితీశ్
పాట్నా: సుమారు 24ఏళ్ల తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్, లాల్ ప్రసాద్ యాదవ్ కలుసుకున్నారు. ఒకే వేదికను పంచుకుని కౌగిలించుకున్నారు. అభినందనలు తెలుపుకుంటూ నవ్వులూ చిందించారు. ఇప్పటి వరకు ఒకరంటే ఒకరికి పడదు.. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు వీరిద్దరూ మిత్రులవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఆగస్టు 21న రాష్ట్రంలో జరగనున్న 10 నియోజకవర్గాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరిద్ధరూ ఒకే వేదికను పంచుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏలో 17ఏళ్ల పాటు భాగస్వామిగా ఉన్న జెడియు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు ఆ కూటమి నుంచి బయటికి వచ్చింది. కాగా, ప్రస్తుతం జెడియు పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్ పార్టీలతో కలిసివెళుతున్నారు.

ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో బీహార్లో ఉన్న మొత్తం 40 స్థానాలకు గానూ బిజెపి ఏకంగా 31 స్థానాలు గెలుచుకుంది. దీంతో మనస్తాపానికి గురైన నితీశ్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. తమ పార్టీలకు పూర్వ వైభవం రావాలంటే కలిసే పోటీ చేయాలనుకున్నారో ఏమో గానీ బద్దశత్రువులైన ఈ మాజీ సిఎంలు.. 1990 తర్వాత మొదటిసారి కలిశారు.
త్వరలో బీహార్లో జరుగనున్న 10 అసెంబ్లీ ఉప ఎన్నికలలో ఆర్డేడి, జెడియు తలో నాలుగు స్థానాలకు, కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో బిజెపిని ఎదుర్కొనేందుకే ఈ మూడు పార్టీలు ఏకమైనట్లు తెలుస్తోంది. ఈ పార్టీల కలయిక పట్ల స్పందించిన రాష్ట్ర బిజెపి... రాజకీయ మనుగడ కోసమే వీరందరూ ఒక్కటయ్యారని పేర్కొంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications