నన్ను పోటి నుండి తప్పుకోమన్నారు, మురళి మనోహర్ జోషి
బిజేపి సినియర్ నేతలు,ఆపార్టీ కురువృద్దులకు పార్టీకి మధ్య జరుగుతున్న చర్చ మరింత వేడి పుట్టించింది.ఇన్నాళ్లు పార్టీ సినియర్ నేత అద్వాని తోపాటు సినియర్ నేత మురళి మనోహర్ జోషి లాంటి వాళ్లు ఈ ఎన్నికల్లో పోటి చేయడం లేదు.దీంతో పార్టీలో పార్టీని వారిని ఉద్దేశ్యపూర్వకంగా తప్పించిందని పలు విమర్శలు ఎదుర్కోంటుంది.ఈనేపథ్యంలో మురళి మనోహర్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మురళి మనోహర్ జోషి ,కాన్పూర్ ప్రజలను ఉద్దేశిస్తూ ,ఓ లేఖ విడుదల చేశారు.అందులో తనను పార్టీ రానున్న ఎన్నికల్లో కాన్పూర్ తోపాటు మరెక్కడి నుండి కూడ పోటి చేయవద్దని లేఖ ద్వార కోరిందని తెలియచేశారు. ఆ లేఖ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ లాల్ పేరుమీద ,ఆయన సంతకం లేకుండా వచ్చిందని తెలిపారు.కాగా ఇదే విధంగా అద్వాని కూడ గతవారమే లేఖ వెళ్లింది.
అయితే పార్టీ నిర్ణయం పై జోషి అసంతృప్తిగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.. అయనకు వచ్చిన లేఖ పార్టీ ప్రధాన కార్యదర్శి నుండి కాకుండా పార్టీ అధ్యక్షుడు నుండి వస్తే బాగుండేదని అభిప్రాయపడినట్టు వారు తెలిపారు. బాజపా వ్వవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోమర్ జోషి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక అంతకుముందు అద్వాని సైతం గాంధినగర్ నుండి తప్పించినందుకు అంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.