బురారీ తర్వాత మరో ఘోరం: కూతుర్ని చంపి.. జార్ఖండ్లో ఫ్యామిలీ ఆత్మహత్య
రాంచీ: న్యూఢిల్లీలోని బురారీలో 11 మంది ఆత్మహత్య కలకలం మరవకముందే జార్ఖండ్లోని హజారీబాగ్లో మరో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు ఆదివారం ఉదయం సామూహికంగా ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఝార్ఖండ్లోని హజారీబాగ్కు చెందిన మార్వాడీ కుటుంబానికి చెందిన ఆరుగురు ఈ దారుణానికి పాల్పడ్డారు. నరేశ్ తొలుత తన తల్లిదండ్రులను, భార్య, కుమారుడిని ఉరితీశాడు. అనంతరం తన కూతుర్ని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వారు సూసైడ్ నోట్ రాసినట్లుగా తెలుస్తోంది. సూసైడ్ నోట్ గుర్తించామని, ఈ కుటుంబం డ్రై ఫ్రూట్ షాప్ నిర్వహిస్తోందని, వ్యాపారంలో నష్టం రావడంతో తీవ్ర అఫ్పుల ఊబిలో కూరుకుపోయారని పోలీసులు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి దర్యాఫ్తు అనంతరమే విషయం తెలుస్తుందన్నారు.

అప్పుల బాధ తాళలేక వీరంతా మృతి చెందినట్లు తమకు సమాచారం అందిందని, మృతదేహాల పరిస్థితి చూస్తుంటే ఆదివారం తెల్లవారు జామునే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మృతి చెందిన వారు మహావీర్ మహేశ్వరి (70), భార్య కిరణ్ మహేశ్వరి (65), నరేశ్ అగర్వాల్ (40), భార్య ప్రీతి అగర్వాల్ (38), ఇద్దరు పిల్లలు అమన్ (8), అంజలి (6).
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications