ఓరియంటల్ బ్యాంక్కు కుచ్చుటోపి పెట్టిన మరో నగల వ్యాపారి
న్యూఢిల్లీ:పంజాబ్ నేషనల్ బ్యాంక్కు నీరవ్ మోడీ రుణాలు ఎగవేసినట్టు ఢిల్లీకి చెందిన మరో వజ్రాల వ్యాపారి కూడ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్కు రూ. 389.85 కోట్లను ఎగవేశారని సిబిఐ కేసు బుక్ చేసింది.
ఈ కేసులో ద్వారకా దాస్ సేత్ ఇంటర్నేషనల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. దాదాపు ఆరు నెలల క్రితం కేసును బుక్ చేశారు. ఈ కేసులో ఆ వజ్రాల వ్యాపార సంస్థకు చెందిన డైరక్లర్లను సీబీఐ విచారిస్తున్నది. ద్వారకా దాస్ సంస్థ 2007 నుంచి 2012 వరకు ఓబీసీ బ్యాంక్ నుంచి 389 కోట్లు రుణం తీసుకొంది.

ఈ కంపెనీ ఎల్ఓసీ తీసుకొని బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ద్వారా తీసుకొన్నారు.కానీ, వాటిని చెల్లించలేదు. దీంతో బ్యాంకు ఫిర్యాదు మేరకు సిబిఐ కేసు నమోదు చేసింది.












Click it and Unblock the Notifications