ఇండిగో ఎయిర్ లైన్స్ తగ్గింపు ధరలు.. రూ.777 నుంచి ప్రారంభం
రాయితీ టిక్కెట్ల పోరులోకి ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా దిగింది. దేశీయ మార్గాలలో ఎంపిక చేసిన మార్గాలలో అన్నీ కలుపుకొని రూ.777కే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది.
ముంబై: రాయితీ టిక్కెట్ల పోరులోకి దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా దిగింది. దేశీయ మార్గాలలో తగ్గింపు ధరలను ఈ సంస్థ ప్రకటించింది. ఎంపిక చేసిన మార్గాలలో అన్నీ కలుపుకొని రూ.777కే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది.
ఈ ఆఫర్ కింద ఫిబ్రవరి 25 వరకే టిక్కెట్లు బుక్ చేసుకునే వీలుంది. అలాగే ఈ టిక్కెట్ల ద్వారా ఏప్రిల్ 27 వరకు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. సెలెక్టడ్ సెక్టార్లో, సెలెక్టడ్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.

ఈ తగ్గింపు టిక్కెట్ల ధరలు అగర్తలా-గౌహతి, శ్రీనగర్-చండీగఢ్ మార్గాలలో రూ.777కే అందుబాటులో ఉండగా, చెన్నై-హైదరాబాద్ మార్గంలో మాత్రం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 19 రోజుల ముందుగా బుక్ చేసుకోవాలని, సీట్లు పరిమితంగా ఉన్నాయని ఇండిగో తెలిపింది.
ఒకవేళ ప్రయాణాన్ని విరమించుకుని టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటే చట్టబద్ధమైన పన్నులు మాత్రమే తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ ఆఫర్ కు సంబంధించి మరిన్ని వివరాలు, సందేహాలకు ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని సంస్థ కోరింది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications