వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుభాష్ చంద్రబోస్ మరణించలేదు..విమాన ప్రమాదసమయంలో మాతోనే ఉన్నారు: ఐఎన్ఏ సైనికులు

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సారి వేడుకల్లో ప్రత్యేకత కనిపించింది. ప్రతిసారిలా కాకుండా ఈసారి మాత్రం వేడుకల్లో తొలిసారిగా కొందరు వ్యక్తులు కవాతు చేశారు. వారిని స్వయంగా కేంద్రప్రభుత్వమే కవాతు చేయాల్సిందిగా ఆహ్వానించింది. ఇంతకీ వీరు ఎవరు.. వీరు అంత ప్రత్యేకంగా ఎందుకు పరిగణించబడుతున్నారు. తెలుసుకోవాలంటే లెట్స్ రీడ్ దిస్ స్టోరీ....

కవాతు చేసిన సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులు

కవాతు చేసిన సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులు

దేశం 70వ గణతంత్రవేడుకలు జరుపుకుంటోంది. దేశరాజధాని ఢిల్లీలో మాత్రం ఈ గణతంత్ర వేడుకల్లో ఓ ప్రత్యేకత కనిపించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన నాటి నలుగురు సైనికులు సారి రాజ్‌పథ్‌లో కవాతు చేశారు. ప్రస్తుతం వీరి వయస్సు 90 ఏళ్ల నుంచి 100 ఏళ్ల మధ్య ఉంది. నాడు బ్రిటీషు వారితో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. నేడు స్వాతంత్ర్యం సిద్ధించాక దేశ ఘనమైన వేడుకల్లో కవాతు చేశారు.

70వ గణతంత్ర వేడుకలు: జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ 70వ గణతంత్ర వేడుకలు: జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్

 సుభాష్ చంద్రబోస్ మరణించలేదు... ఇప్పటికీ బతికే ఉన్నాడు

సుభాష్ చంద్రబోస్ మరణించలేదు... ఇప్పటికీ బతికే ఉన్నాడు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇప్పటికీ తమ నాయకుడంటూ చాలా గర్వంగా చెబుతున్నారు ఈ సైనికులు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాడు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు నిచ్చారని అయితే అది నాడు సాధ్యపడలేదని ఇప్పుడు రాజ్‌పథ్‌లో కవాతు చేసి నేతాజీ పిలుపును నేడు నెరవేర్చినట్లుగా భావిస్తున్నామని ఆనందంతో చెప్పారు. లాల్తీ రామ్ అనే 96ఏళ్ల నాటి సైనికుడు ఐఎన్ఏతో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. నాడు ఆర్టిలరీలో తన పోస్టింగ్ ఉండేదని నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. అంతేకాదు ఇప్పటికీ విమాన ప్రమాదంలో నేతాజీ సుబాష్ చంద్రబోస్ మరణించాడంటే లాల్తీరామ్ నమ్మరు. నేతాజీ విమానప్రమాదంలో మృతిచెందారనే వార్త ప్రపంచానికి తెలిసిన కొద్ది గంటల్లోనే ... బోస్ బ్రిగేడ్‌తో పాటు కూర్చుని ఉన్నారని చెబుతున్నారు. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంకా బతికే ఉన్నారన్న దృఢ నమ్మకాన్ని లాల్తీరాం వ్యక్తపరిచారు.

 ఆలస్యమైనా సరే మోడీ వీరిని గుర్తించారు

ఆలస్యమైనా సరే మోడీ వీరిని గుర్తించారు

మరో ఐఎన్ఏ సైనికుడు 97 ఏళ్ల హీరా సింగ్ మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం నలుగురు సైనికుల్లో 100 ఏళ్ల వయసున్న మరో సైనికుడు భగ్మల్, 99 ఏళ్ల పరమానంద్ కూడా తమ అనుభవాలు పంచుకున్నారు. హర్యానా రాష్ట్రం మనేసర్‌కు చెందిన భగ్మల్ 1942లో ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరాడు. ఆలస్యమైనా సరే ప్రధాని నరేంద్ర మోడీ ఈ వీరజవాన్లను గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కవాతు చేసే భాగ్యం కల్పించిన ప్రధానికి ధన్యవాదాలు అంటూ రక్షణ నిపుణులు మేజర్ జనరల్ జీడీ భక్షీ తెలిపారు. నాడు దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు పనంగా పెట్టి ఇండియన్ నేషనల్ ఆర్మీలో ప్రదాన పాత్ర పోషించిన సైనికులు ఇంకా ఏడెనిమిది మంది బతికే ఉన్నారని చెప్పిన మేజర్ జనరల్ భక్షీ ... వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.

English summary
Four Indian National Army (INA) veterans, all aged 90 and above, for the first time ever participated in the 70th Republic Day parade this year. Earlier, on Thursday the veterans had thanked PM Modi and the central government for recognising their contribution to the freedom struggle of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X