కేంద్ర మంత్రులు రాజీనామా, క్యాబినెట్ పునర్వవ్యస్థీకరణ!
న్యూఢిల్లీ: ఇద్దరు కేంద్ర మంత్రులు గురువారం నాడు అర్ధరాత్రి రాజీనామా చేశారు. రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఉమా భారతిలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. మరో ఐదుగురు మంత్రులు కూడ రాజీనామా చేయనున్నారు.
కేంద్ర మంత్రి పదవికి రాజీవ్ ప్రతాప్ రూఢీ గురువారం రాత్రి రాజీనామా చేశారు. రెండు, మూడు రోజుల్లో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నందున రాజీవ్ మంత్రిపదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత ఏర్పడింది
కేంద్ర స్కిల్స్ డెవలప్మెంట్ పదవికి రాజీవ్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రివర్గంలో జెడియూ, అన్నాడిఎంకె కూడ కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

సెప్టెంబర్ 1 లేదా రెండవ తేదిన మోడీ తన మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు అమిత్షా తన నివాసంలో 8 మంది కేంద్ర మంత్రులతో గురువారం సాయంత్రం సమావేశమయ్యారు.
అయితే గుజరాత్ ఎన్నికలతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులను పురస్కరించుకొని అమిత్షా నివాసంలో పార్టీ నేతల వరుస సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
మరో కేంద్ర మంత్రి ఉమాభారతి కూడ మంత్రిపదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణను దృష్టిలో ఉంచుకొని ఈ ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారని సమాచారం.
వీరితో పాటు మరో ఐదుగురు మంత్రులు కూడ రాజీనామా చేస్తారని సమాచారం. ప్రధానమంంత్రి మోడీ చైనా పర్యటనకు ఈ నెల 3వ, తేదిన బయలుదేరనున్నారు. ఆ లోపుగానే మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ జరిగే అవకాశం లేకపోలేదు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications