Ahmedabad Blasts Verdict: 38 మందికి ఉరి-11 మందికి యావజ్జీవం-హైకోర్టు సంచలన తీర్పు..!
2008లో జరిగిన గుజరాత్ లోని అహ్మదాబాద్ పేలుళ్ల (Ahmedabad Blasts)కేసులో గుజరాత్ హైకోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 38 మందికి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది. అలాగే 11 మందికి యావజ్జీవ శిక్ష కూడా విధించింది. దీంతో వీరంతా ఇప్పుడు సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవాల్సి ఉంది. 2008లో జరిగిన ఈ పేలుళ్లలో 56 మంది చనిపోయారు. దీనిపై సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
2008 జూలై 26న అహ్మదాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సివిల్ ఆసుపత్రి, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించే ఎల్జీ (LG) ఆసుపత్రి, బస్సులు, పార్క్ చేసిన సైకిళ్లు, కార్లు, ఇతర ప్రదేశాలతో సహా పలు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. వీటిలో మొత్తం 56 మంది మృత్యువాత పడ్డారు. ఈ కేసును విచారించిన అహ్మదాబాద్ స్దానిక కోర్టు 2002లో మొత్తం 49 మంది నిందితుల్లో 38 మందికి మరణశిక్ష విధించింది. అలాగే 11 మందికి జీవిత ఖైదు విధించింది.

అలాగే ఈ పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1లక్ష, తీవ్రంగా గాయపడిన బాధితులకు ఒక్కొక్కరికి రూ. 50వేలు, స్వల్ప గాయాలైన వారికి ఒక్కొక్కరికి రూ. 25వేలు చొప్పున పరిహారం చెల్లించాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. అలాగే దోషులుగా తేలిన 48 మందిలో ఒక్కొక్కరికి రూ.2.85 లక్షల జరిమానా కూడా విధించింది. హత్య, దేశద్రోహం, ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం వంటి ఐపీసీలోని వివిధ నేరాలతో పాటు, ఉపా, పేలుడు పదార్థాల చట్టం కింద నమోదైన నేరాలకు సంబంధించి మొత్తం 78 మంది నిందితులలో 49 మందిని దోషులుగా విచారణ కోర్టు 2022 ఫిబ్రవరి 8న నిర్ధారించింది. వీటిని ఇవాళ హైకోర్టు సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.













Click it and Unblock the Notifications