జయ మృతి: సీబీఐ నుంచి శశికళ తప్పించుకోలేరు ! ఎంపీ
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ జయలలిత ఎలా మరణించారు అనే విషయంపై సీబీఐకి పూర్తి సమాచారం ఇచ్చి తీరాలని, ఈ కేసు నుంచి ఆమె ఎటుంటి పరిస్థితిలో తప్పించుకోలేరని రాజ్యసభ సభ్యురాలు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎలా మరణించారు ? అనే విషయంలో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు అసలు గుట్టు బయటపెడుతారని, అమ్మ మరణానికి కారణం అయిన వారు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప పరోక్షంగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ను హెచ్చరించారు.
చిక్కుల్లో అమ్మ క్యాంటీన్లు: రూ. 120 కోట్లు నష్టం, పట్టించుకోని ?
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ అమ్మ ఎలా మరణించారు అనే విషయంపై పూర్తి సమాచారం సీబీఐకి ఇచ్చి తీరాలని, ఈ కేసు నుంచి ఆమె ఎటుంటి పరిస్థితిలో తప్పించుకోలేరని ఎంపీ శశికళ పుష్ప చెప్పారు.

జయలలితను ఇంత కాలం ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు ? అనే విషయంపై శశికళ నాటరాజన్ సీబీఐ అధికారులకు వివరించ వలసి ఉంటుందని, నిజానిజాలు ప్రజలకు తెలియాలని అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప అన్నారు.
షాక్: సంక్రాంతికి శశికళ దిమ్మ తిరిగింది: పార్టీలో తిరుగుబాటు !

తమిళనాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జయలలిత మరణానికి కారణం అయిన వారు ఎవరైనా సరే చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఎంపీ శశికళ పుష్ప డిమాండ్ చేశారు. శశికళ నటరాజన్ ఎప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి కాలేరని, అన్నాడీఎంకే కార్యకర్తలు తిరుగుబాటు చేసే సమయం దగ్గర పడిందని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications