అన్నాడీఎంకే పార్టీ మేనిఫెస్టో విడుదల.. కీలక హామీలు ఇవే..
తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఈ మేరకు అన్నాడీఎంకే పార్టీ తొలి దఫా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. 5 ప్రధాన హామీలతో మేనిఫెస్టోను అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి విడుదల చేశారు. మరోవైపు విజయ్ టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రచార కమిటీని టీవీకే అధ్యక్షుడు విజయ్ ఏర్పాటు చేశారు.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. AIADMK పార్టీ తాజాగా తొలి దఫా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. 5 ప్రధాన హామీలతో మేనిఫెస్టోను అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి విడుదల చేశారు. వీటిలో మహిళల సంరక్షణ కోసం కులవిలక్కు పథకం.. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు కలిగిన మహిళలకు ప్రతినెలా రూ. 2 వేలు అందించనున్నట్లు మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. ఈ సాయాన్ని అర్హులైన మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని హామీ ఇచ్చారు.
మరో పథకంలో భాగంగా పురుషులకు ఫ్రీ బస్సు ప్రయాణం ఉంటుందని తెలిపింది. మహిళలతోపాటుగా పురుషులకూ ఉచిత బస్సు సేవలు కల్పిస్తామని AIADMK పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే అమ్మ ఇల్లమ్ స్కీమ్ కింద.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటిని నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాక రూరల్ ఎంప్లాయిమెంట్ పథకం కింద ఇప్పటివరకూ కేంద్రం ఇస్తున్న 125 ఉపాధి హామీ పని దినాలను 150 రోజులకు పెంచనున్నట్లు అన్నాడీఎంకే పార్టీ తెలిపింది.

ఇక అమ్మా టూవీలర్ స్కీమ్ కింద అర్హులైన 5 లక్షల మంది మహిళలకు రూ. 25 వేల సబ్సిడీ కింద టూ వీలర్లు అందిస్తామని అన్నాడీఎంకే పార్టీ పేర్కొంది. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ.. టీవీకే అధ్యక్షుడు విజయ్ పార్టీ శ్రేణులకు అధికారిక లేఖ విడుదల చేస్తూ ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ రానున్న ఎన్నికల్లో పార్టీ తరఫున జరగబోయే అన్ని ప్రచార కార్యక్రమాలను సమన్వయం చేసి పర్యవేక్షించనుందని విజయ్ తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications