విజయ్ గూటికి జయలలిత నమ్మకస్తుడు!
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఏఐఏడీఎంకే సీనియర్ నేత, తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేఏ సెంగోట్టయ్యన్ గురువారం నాడు ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజకం(టీవీకే) పార్టీలో చేరారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు సీనియర్ లీడర్ పార్టీలో చేరడం టీవీకేకు పెద్ద బలంగా మారింది.
రాజకీయ భీష్ముడికి విజయ్ స్వాగతం
సెంగోట్టయ్యన్ను టీవీకే ప్రధాన కార్యాలయంలో పార్టీ కండువా కప్పి విజయ్ సాదరంగా ఆహ్వానించారు. 50 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ దురందురుడు పార్టీలోకి వచ్చినందుకు విజయ్ హర్షం వ్యక్తం చేసారు. ఎంజీఆర్(ఎంజీ రామచంద్రన్)ను నమ్ముకుని 20 ఏళ్ల చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చిన సెంగోట్టయ్యన్.. ఎంజీఆర్, జయలలిత వంటి ఇద్దరు గొప్ప నాయకులకు నమ్మకంగా పనిచేశారని విజయ్ కొనియాడారు. సెంగోట్టయ్యన్ రాజకీయ పరిపక్వత, క్షేత్రస్థాయి అనుభవం టీవీకేకు ఎంతగానో దోహదపడుతుందని విజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

పశ్చిమ తమిళనాడులో పట్టు:
సెంగోట్టయ్యన్ ఏఐఏడీఎంకే కంచుకోటగా ఉన్న పశ్చిమ తమిళనాడులోని గౌండర్ కమ్యూనిటీకి చెందిన ప్రభావవంతమైన నాయకుడు. ఆయన ఒక అద్భుతమైన ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. 2026 ఎన్నికలకు ముందు టీవీకే తమ క్షేత్రస్థాయి నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నందున, సెంగోట్టయ్యన్కు కీలకమైన సంస్థాగత బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. అంతేకాకుండా టీవీకే అధికారంలోకి వస్తే, పాలనలో కూడా ఆయనకు భాగస్వామ్యం లభిస్తుందని హామీ ఇవ్వబడింది.
BREAKING: Former Tamil Nadu Minister K.A. Sengottaiyan has officially joined Tamilaga Vettri Kazhagam (TVK) in the presence of party president Vijay. #TVKVijay @TVKVijayHQ @KASengottaiyan pic.twitter.com/5EAqlF6187
— Actor Vijay Team (@ActorVijayTeam) November 27, 2025
ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు కారణం
జయలలిత మరణం తర్వాత వరుసగా మూడు ఎన్నికల ఓటముల నుంచి పార్టీ కోలుకోవాలంటే అన్ని వర్గాలను ఏకం చేయాలని సెంగోట్టయ్యన్ గట్టిగా వాదించారు. ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరించబడిన నాయకులు శశికళ, ఓ.పన్నీర్సెల్వం (OPS), టి.టి.వి. దినకరన్లను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఆయన పదేపదే ఎడప్పాడి పళనిస్వామి (EPS)ని కోరారు. ఓ.పన్నీర్సెల్వం, శశికళలను కలిసిన తర్వాత పళనిస్వామి మొదట సెంగోట్టయ్యన్ను పార్టీ పదవుల నుంచి తొలగించి, ఆ తర్వాత బహిష్కరించారు. తన బహిష్కరణను వ్యతిరేకిస్తూ ఈపీఎస్ పార్టీలో నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని సెంగోట్టయ్యన్ విమర్శించారు.
రాజకీయ స్పందనలు
సెంగోట్టయ్యన్ పార్టీని వీడటాన్ని ఏఐఏడీఎంకే ప్రతినిధి కోవై సత్యన్ కొట్టిపారేశారు. "ఏ ఒక్క వ్యక్తి పార్టీ, గుర్తు, సిద్ధాంతం కంటే పెద్ద కాదు. ఆయనకు గుర్తింపు ఇచ్చిన ఏఐఏడీఎంకేను వదులుకున్నారు. ఇప్పుడు ఈ బాధ్యత టీవీకేకు మారింది" అని వ్యాఖ్యానించారు. సెంగోట్టయ్యన్ ప్రభావం తన నియోజకవర్గానికే పరిమితమని, ఏఐఏడీఎంకేకు ఎలాంటి నష్టం జరగదని ఆ పార్టీ పేర్కొంటోంది. అధికార డీఎంకే ఈ పరిణామం తమను కలవరపెట్టలేదని పేర్కొంది. సెంగోట్టయ్యన్ టీవీకేలో చేరడం ఏఐఏడీఎంకే కార్యకర్తలకు మరింత ఆందోళన కలిగించే విషయమని డీఎంకే ప్రతినిధి అన్నారు. 2026 ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో అనుభవజ్ఞుడైన సెంగోట్టయ్యన్ చేరిక నటుడు విజయ్ కొత్త పార్టీ టీవీకేకు వ్యూహాత్మకంగా ఎంతవరకు లాభం చేకూరుస్తుందో చూడాలి.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications