ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన సీఎం పళని, పన్నీర్: అఫిడవిట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేల లిస్ట్ !
భారత ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన ఈపీఎస్, ఓపీఎస్జయలలితకు నిజమైన వారసులు మేమే, అఫిడవిట్లు ఇచ్చిన సీఎం, డీసీఎం గ్రూప్ఈసీకి మెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేల వివరాలు, రెండాకులు చిహ్నం మాదే అంటూ ధీమా
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు కలిసిపోయాయని, ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి పార్టీ రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భారత ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు.
ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం మద్దతుదారులు శుక్రవారం ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని లేఖ ఇచ్చారు. తమ వర్గంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారు, వారి పేర్లు, వివరాలు, కొన్ని అఫిడవిట్లు ఎన్నికల కమిషన్ అధికారులకు సమర్పించారు. అక్టోబర్ 5వ తేదీ మద్యాహ్నం 3 గంటలకు రెండాకుల చిహ్నం ఎవరికి కేటాయించామో అనే వివరాలు ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.

శుక్రవారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. రెండాకుల చిహ్నం మాకే వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ గుర్తు మీద పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జయలలితకు, అన్నాడీఎంకే పార్టీకి తామే నిజమైన వారసులని ఈపీఎస్, ఓపీఎస్ చెప్పారు.
అన్నాడీఎంకే పార్టీని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న శశికళ, టీటీవీ దినకరన్, వారి కుటుంబ సభ్యుల చేతికి పార్టీ చిహ్నం ఇవ్వమని అన్నారు. మెజారిటీ ఎంపీలు, శాసన సభ్యులు మా వైపే ఉన్నారని సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గుర్తు చేశారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications