కర్ణాటకలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం, బళ్లారిలో చాలెంజ్, కాంగ్రెస్ హంగామా!
బళ్లారి/బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాద్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ మొదటి సారి కర్ణాటకలో అడుగుపెడుతున్నారు. కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ ఫిబ్రవరి 10వ తేదీ శనివారం శ్రీకారం చుట్టారు. శనివారం మద్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా బళ్లారి విమానాశ్రం చేరుకుంటారు. తరువాత బళ్లారి నుంచి హోస్ పేట చేరుకుని ఎన్నికల ప్రచారం మొదలుపెడుతారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో హంగామా మొదలైయ్యింది.
Recommended Video


సీఎం సిద్దూ రెడీ
యువరాజు రాహుల్ గాంధీకి స్వాగతం పలకడానికి ఇప్పటికే సీఎం సిద్దరామయ్య బళ్లారిలో మకాం వేశారు. కేపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జ్ వేణుగోపాల్, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర్ హోస్ పేటలో మకాం వేసి కార్యక్రమం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

వాటర్ బాటిల్ మీద కాంగ్రెస్ స్టిక్కర్
రాహుల్ గాంధీ బహిరంగ సభకు హాజరవుతున్న వారికి ఆహారం, వాటర్ బాటిల్స్, కాంగ్రెస్ పార్టీ టోపీలు పంచిపెట్టడానికి సర్వం సిద్దం చేశారు. వాటర్ బాటిల్ మీద కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్ అతికించి ఇచ్చి ఆలా కూడా ప్రచారం చేసుకుంటున్నారు.

ఆనంద్ సింగ్ కు చాలెంజ్
ఇటీవల బీజేపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనంద్ సింగ్ నియోజక వర్గం హోస్ పేటలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం మొదటి బహిరంగ సభ సమావేశం కావడంతో ఆయన చాలెంజ్ గా తీసుకుని భారీ ఎత్తున కార్యకర్తలను తరలిస్తున్నారు.

దేవాలయాలు, దర్గాలు
హోస్ పేటలో బహిరంగ సభ సమావేశం పూర్తి అయిన వెంటనే రాహుల్ గాంధీ కోప్పళ వెలుతున్నారు. సాయంత్రం కకనూరులో జరిగే సమావేశంలో పాల్గొంటున్నారు. మార్గం మధ్యలో రాహుల్ గాంధీ దేవాలయాలు, దర్గాలు సందర్శించనున్నారు.

భారీ బందోబస్తు
రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా కర్ణాటక ప్రభుత్వం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటికే హోస్ పేట, కోప్పళలో అదనపు బలగాలు మొహరిస్తున్నాయి. రాహుల్ గాంధీ నాలుగు రోజుల పర్యటన, బహిరంగ సభలు, రోడ్ షోలు విజయవంతం చెయ్యాలని సీఎం సిద్దరామయ్య ఇప్పటికే స్థానిక నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications