గోడను ఢీకొన్న ఎయిర్ ఇండియా విమానం..తప్పిన పెను ప్రమాదం
త్రిచి: ఎయిర్ ఇండియా విమానంకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కేరళలోని త్రిచి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ఒకటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రహారీ గోడను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమయంలో మొత్తం 136 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు.
దుబాయ్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం అదుపు తప్పి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గోడను ఢీకొట్టింది. గోడ ధ్వంసం కాగా విమానం కూడా స్వల్పంగా ధ్వంసం అయ్యింది. ఇక ముంబై విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా పరీక్షించారు. అనంతరం ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు.

విమానం త్రిచిలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రహరీ గోడను ఢీకొట్టడంపై అతర్గత విచారణకు ఆదేశించినట్లు ఎయిర్ఇండియా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు పైలట్, కోపైలట్లు వివరణ ఇవ్వాల్సిఉన్న నేపథ్యంలో వారి స్థానంలో మరొకరిని నియమించినట్లు తెలిపింది ఎయిర్ ఇండియా సంస్థ. మరోవైపు జరిగిన ఘటనపై పౌరవిమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్కు కూడా సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారని వారిని అక్కడి నుంచి మరో విమానంలో దుబాయ్కు పంపినట్లు వెల్లడించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications