ఎయిర్ ఇండియా ప్లైట్ ల్యాండ్: మనేసర్ కంటోన్మెంట్ ఆస్పత్రిలో ప్రయాణికులకు చికిత్స, పర్యవేక్షణలోనే..

Recommended Video

    Coronavirus : Isolation Wrds For Indians Came In Air India Special Flight From China's Wuhan

    కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చస్తోంది. వైరస్ బారినపడి ఇప్పటికే 259 మంది చనిపోగా.. వేలాదిమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వుహన్‌ నుంచి వైరస్ క్రమంగా విస్తరించింది. అక్కడున్న భారతీయులను ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకొచ్చారు. 324 మంది భారతీయ ప్రయాణికులతో వచ్చిన విమానం శనివారం ఢిల్లీలో ల్యాండయ్యింది.

    324 మంది ప్రయాణికులు

    324 మంది ప్రయాణికులు

    శుక్రవారం అర్ధరాత్రి 1.17 గంటలకు చైనా నుంచి ఎయిర్ ఇండియా జంబో బీ747 విమానం ఢిల్లీ బయల్దేరింది. శనివారం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. విమానంలో 324 మంది భారతీయ ప్రయాణికులు ఉన్నారు. వారితోపాటు రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన ఐదుగురు వైద్యులు, ఒక పారామెడికల్ సిబ్బంది కూడా ఉన్నారని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

    14 రోజులు పర్యవేక్షణ

    14 రోజులు పర్యవేక్షణ

    ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణికులను మనేసర్‌ తరలిస్తారు. అక్కడ కంటోన్మెంట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. కరోనా వార్డుల కోసం ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. వీరందరినీ 14 రోజులపాటు అక్కడే ఉంచుతారు. ప్రయాణికులందరికీ వైద్య పరీక్షలు చేస్తారు. పాజిటివ్ రాకుంటే వారందరినీ స్వస్థలాలకు పంపిస్తారు. పాజిటివ్ వచ్చినవారికి వైద్య సేవలు అందిస్తారు.

    నిలకడగా..

    నిలకడగా..


    కరోనా వైరస్ కేరళలో ఒకరికి సోకింది. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు ఒక్కరు కూడా మృతి చెందలేదని అధికారులు పేర్కొన్నారు. చైనా నంచి 324 మంది ప్రయాణికులను తీసుకురాగా.. మరో విమానం చైనా పంపిస్తామని ఎయిర్ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+