పాక్ గగనతలం మూసివేయడంతో ఎయిరిండియాకు భారీ నష్టం..ఎంతో తెలుసా..?
న్యూఢిల్లీ: బాలాకోట్ దాడుల తర్వాత పాక్ గగనతలంను మూసివేయడంతో భారత ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియాకు భారీ నష్టాలు వచ్చాయి. జూలై 2వ తేదీ వరకు ఎయిరిండియాకు వచ్చిన నష్టం అక్షరాల రూ.491 కోట్లు అని పౌరవిమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాజ్యసభలో తెలిపారు. ఇక ప్రైవేట్ సంస్థలు అయిన స్పైస్ జెట్, ఇండిగో, గోఎయిర్ సంస్థలకు వరుసగా రూ.30.73 కోట్లు, రూ.25.1 కోటి, రూ. 2.1 కోటి నష్టం వాటిల్లినట్లు ఆయన బుధవారం సభకు వివరించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన ఇండియన్ ఎయిర్ఫోర్స్ బాలాకోట్లో మెరుపుదాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ తన గగనతలంను మూసివేస్తూ భారత విమానాలపై ఆంక్షలు విధించింది. ఇదిలా ఉంటే మొదట్లో భారత గగనతలంను మూసివేస్తున్నట్లు మన ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మే 30న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే పాకిస్తాన్ తన గగనతలంపై ఆంక్షలు విధించడం తన ఏకపక్షధోరణిని తెలియజేస్తోందని అయినప్పటికీ ఆదేశ ప్రభుత్వం విజ్ఞతకే ఈ అంశాన్ని వదిలివేస్తున్నామని మంత్రి సభకు తెలిపారు.

-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications