షాక్: కండోమ్ అడ్వర్టైజ్మెంట్లన్నీ రాత్రి 10 తర్వాతే, కారణమిదే
న్యూఢిల్లీ: కండోమ్ ప్రకటనలపై అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( ఎఎస్సీఐ) సంచలన నిర్ణయం తీసుకొంది. రాత్రి పది గంటల నుండి ఉదయం 6 గంటల సమయంలోనే కండోమ్ ప్రకటనలు ఇచ్చేలా అన్ని టీవీ చానెళ్ళకు ఆదేశించాలని ఎఎస్సీఐ సూచించింది.
సన్నీ లియోన్ కండోమ్ ప్రకటనలపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కండోమ్ ప్రకటనలపై అడ్వర్టైజింగ్ స్టాండర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ మేరకు శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొంది.
ఈ తరహ అడ్వర్టైజ్ మెంట్లపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తిన సమయంలో టీవీ చానెళ్ళకు పలు సూచనలను చేస్తున్నారు. ఈ సూచనల ఆధారంగా టీవి ఛానెళ్ళకు ఎఎస్సీఐ పలు సూచనలు చేస్తోంది.

కండోమ్ ప్రకటనపై
ఇటీవల సన్నీ లియోన్ నటించిన కండోమ్ ప్రకటనపై పలు ఫిర్యాదులు వచ్చాయి. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పలు సూచనలను చేసింది.ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. కండోమ్ ప్రకటనలను అర్ధరాత్రి పది గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ప్రసారం చేయాలని టీవీ చానెళ్ళను కోరింది..

అభ్యంతరకరమైన దృశ్యాలు
పలు సంతాన నిరోధక కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడం కోసం అభ్యంతరకరమైన దృశ్యాలను చూపిస్తున్నాయంటూ పెద్దఎత్తున ఫిర్యాదులు అందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎఎస్సీఐ పేర్కొంది.ఈ మేరకు కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖకు లేఖ రాసినట్టు ఎఎస్సీఐ వర్గాలు తెలిపాయి.

ఫిర్యాదుల ఆధారంగా
తమ కండోమ్ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకొనేందుకు కంపెనీలు తయారు చేసిన అడ్వర్టైజ్మెంట్లు కుటుంబసభ్యులతో కలిసి చూసే విధంగా ఉండడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎఎస్సీఐ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

టీవీ ఛానెళ్ళను ఆదేశించాలని లేఖ
కండోమ్ ప్రకటనలను రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటలలోపు ప్రసారం చేసేలా టీవీ చానెళ్ళను ఆదేశించాలని కోరుతూ ఎఎస్సీఐ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను కోరింది. ఈ మేరకు కండోమ్ అడ్వర్టైజ్మెంట్లపై వస్తున్న అభ్యంతరాలను ఆ లేఖలో ప్రస్తావించింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications