'మోడీ ఎన్నిక చెల్లదు' : అలహాబాద్ హైకోర్టులో కాంగ్రెస్ నేత పిటిషన్
లక్నో : 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం కోసం.. ప్రధాని మోడీ ప్రజలను ప్రలోభ పెట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో మోడీ ముఖచిత్రాలతో ఉన్న టీషర్ట్ లను, పోస్టర్లను ఓటర్లకు పంపిణీ చేశారని, ఇలాంటి చర్యలు ఒకరకంగా జనాలను ప్రలోభ పెట్టేందుకు ఇచ్చిన లంచంగానే పరిగణించాల్సి వస్తుందని అజయ్ రాయ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

కాగా, 2014 ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి మోడీకి ప్రత్యర్థికి పోటి చేసి ఓడిపోయారు అజయ్ రాయ్. ఇక తాజాగా ఆయన వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించడం గమనార్హం. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మోడీ తరుపు న్యాయవాదులు.. పిటిషన్ లో అజయ్ రాయ్ పేర్కొన్న కారణాలన్ని అసంబద్దమైనవేనని వాదించారు.
పిటిషన్ లో పేర్కొన్న ఆరోపణలన్ని ప్రజా ప్రతినిధుల చట్టం కిందకు రావని మోడీ తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కోర్టు మాత్రం పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తూ.. నవంబర్ 15వ తేదీన తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications