యుపి రేప్, నేరాలకే ప్రచారమా?: మీడియాపై అఖిలేష్

రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలు, ఇతర నేరాలు బయటపడుతుండటంతో అఖిలేశ్ ప్రభుత్వంపై ఇతర పార్టీల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిని అఖిలేష్ యాదవ్ మీడియాపైనే రుసరుసలాడారు.
అత్యాచారాలు, నేరాలు ప్రతిచోటా జరుగుతున్నాయని, జాతీయ మీడియా ఉత్తరప్రదేశ్లోని నేరాలనే ఎత్తిచూపుతోందని అఖిలేష్ అన్నారు. తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు వేరే రాష్ట్రాల్లో జరుగుతున్న నేరాలు కన్పించడం లేదా అని అఖిలేశ్ ప్రశ్నించారు.
బదౌన్ ఘటనలో అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, సిబిఐ విచారణపైనా నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని నేరాలపైనా తగిన చర్యలు తీసుకుంటున్నామని అఖిలేష్ చెప్పారు.












Click it and Unblock the Notifications