నేడే సెకండ్ ఫేజ్: బెంగాల్, అసోం.. మమతా నందిగ్రామ్లో ఎన్నిక.. బరిలో వీరే
మరికొన్ని గంటల్లో బెంగాల్, అసోంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఈసీ అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసింది. సెకండ్ ఫేజ్లో దీదీ మమతా బెనర్జీ పోటీచేసే నందిగ్రామ్ కూడా ఉంది. ఆమె ప్రత్యర్థి సువేందు అధికారి కూడా ధీటుగా ప్రచారం నిర్వహించారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. నందిగ్రామ్ ఓటరు ఎటువైపు ఉన్నారో మరికొద్దిరోజుల్లో తేలనుంది.
బెంగాల్లో 30 సీట్లలో ఎన్నిక జరగనుంది. 75 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోని.. 191 మంది అభ్యర్థులకు విలువైన ఓటు వేయనున్నారు. ఇటు అసోంలో 39 అసెంబ్లీ స్థానాల్లో 73.44 లక్షల మంది వయోజనులు ఓటు వేయబోతున్నారు. 345 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానున్నది. బెంగాల్లో 8 విడతల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అసోంలో ఐదుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్, ఐదుగురు ప్రతిపక్ష నేతలు గురువారం నాటి పోలింగ్ బరిలో ఉన్నారు.
30 సీట్లలో టీఎంసీ, బీజేపీ పోటీ చేస్తున్నాయి. సీపీఎం మాత్రం 15 చోట్ల మాత్రమే బరిలో ఉంది. సంజుక్త మోర్చా, కాంగ్రెస్, 13 చోట్ల పోటీలో ఉన్నాయి. 10 వేల 620 పోలింగ్ బూతులలో ఎన్నికలు జరుగుతాయి.