రేపు 6 రాష్ట్రాల్లోని 7 సీట్లకు ఉపఎన్నికలు-ఇండియా కూటమి ఐక్యతకు తొలి పరీక్ష !
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించే లక్ష్యంతో విపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమికి రేపు తొలి పరీక్ష ఎదురుకాబోతోంది. ఇప్పటివరకూ ఇండియా కూటమి సభ్యులు పాట్నా, బెంగళూరు, ముంబైలో మూడు భేటీలు పెట్టుకుని తామంతా ఐక్యంగా ఉన్నామని చెప్పుకుంటుండగా.. ఇప్పుడు ఆ మాటలు చేతల్లో ఎలా ఉండబోతున్నాయో తేల్చే పరీక్ష ఎదురుకాబోతోంది. రేపు ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ సీట్లకు జరిగే ఎన్నికలు ఇండియా కూటమికి కీలకంగా మారాయి.
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో రేపు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో జార్ఖండ్లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్ మరియు ధన్పూర్, ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్, ఉత్తరప్రదేశ్లోని ఘోసి, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్లోని ధూప్గురి స్ధానాలు ఉన్నాయి.వీటిలో పశ్చిమబెంగాల్, యూపీలో ఇండియా కూటమి పక్షాలకు అసలు పరీక్ష ఎదురుకాబోతోంది. ఇప్పటివరకూ ఐక్యంగా ఉన్నట్లు చెప్పుకుంటున్న ఇండియాకూటమి పార్టీలు ఈ రెండు చోట్ల ఏం చేయబోతున్నాయనేది తేలిపోనుంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని ఘోసి స్ధానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇండియా కూటమి పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ పోటీ చేస్తుండగా.. ఎస్పీ నుంచి బీజేపీలోకి మారిన మాజీ ఎమ్మెల్యే దారాసింగ్ చౌహాన్ బరిలో నిలిచారు. అయితే కాంగ్రెస్, బీఎస్పీలు అభ్యర్ధుల్ని పోటీలో పెట్టలేదు. ఓబీసీలు ఎక్కువగా ఉన్న ఈ సీటులో జరుగుతున్న ద్విముఖ పోరులో ఇండియాకూటమి పార్టీ అయిన ఎస్పీకి కాంగ్రెస్ నుంచి ఎంత సహకారం లభిస్తుందన్నది తేలాల్సి ఉంది.
అలాగే పశ్చిమబెంగాల్ లోని ధూప్ గురి స్ధానంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల మధ్య ఉపఎన్నికల పోరు జరుగుతోంది. అయితే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నుంచి ఇక్కడ తృణమూల్ అభ్యర్ధికి మద్దతు లభించాల్సి ఉంది. ఈ విషయంలో లెఫ్ట్, కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంటోంది. ఇలా యూపీ, బెంగాల్లో జరుగుతున్న ఉపఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఇండియా కూటమి బీటలు వారడం ఖాయం. దీంతో అందరి దృష్టీ రేపటి ఉపఎన్నికలపై నెలకొంది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
Lok Sabha: 816కు లోక్ సభ సీట్లు..! ఉత్తరాదిలో గెలిస్తే అధికారమేనా ? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications