"చర్యకు ప్రతిచర్య, దేవుడే చేయించాడు"-సీజేఐపై దాడిని సమర్ధించుకున్న లాయర్..!
నిన్న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఏకంగా ఛీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పై షూ విసిరేందుకు ప్రయత్నించిన లాయర్ రాజేష్ కిషోర్ మరో షాకిచిచ్చాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేయాల్సింది పోయి ఎదురుదాడికి దిగాడు. తన చర్యను సమర్దించుకోవడంతో పాటు అందుకు మద్దతుగా పలు విచిత్రమైన వాదనల్ని తెరపైకి తెస్తున్నాడు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
సనాతన ధర్మాన్ని ఎగతాళి చేశారంటూ ఛీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పై నిన్న షూ విసిరిన లాయర్ రాజేష్ కిషోర్ తన చర్యను సమర్ధించుకున్నాడు. ఆ పని తాను చేయలేదని, దేవుడే చేయించాడంటూ వ్యాఖ్యానించారు. ఇది దేవుడి ఆదేశం అన్నాడు. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నాడు. ఈ మేరకు విచారణలో అతను పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నిన్న కోర్టు గదిలోనే సనాతన ధర్మాన్ని అవమానిస్తుంటే ఊరుకునేది లేదంటూ రెచ్చిపోయిన లాయర్.. ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని సైతం సమర్ధించుకుంటున్నట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసం కావడంతో, దీన్ని పునర్ నిర్మించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సీజేఐ బీఆర్ గవాయ్ దాన్ని తిరస్కరించారు. ఈ సందర్భంగా మీ దేవుడినే ఏదో ఒకటి చేయాలని అడగాలని వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై సోషల్ మీడియాలో గతంలోనే సీజే క్లారిటీ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

#WATCH | Delhi: Suspended Advocate Rakesh Kishore, who attempted to hurl an object at CJI BR Gavai, says, "...I was hurt...I was not inebriated, this was my reaction to his action...I am not fearful. I don't regret what happened."
— ANI (@ANI) October 7, 2025
"A PIL was filed in the Court of CJI on 16th… pic.twitter.com/6h4S47NxMd
ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మాన్ని ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేశారంటూ సీజేఐ గవాయ్ ను బీజేపీ, పలు హిందూ సంస్థల కార్యకర్తలు సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. ఈసారి ఏకంగా ఛీఫ్ జస్టిస్ పైనే అదీ కోర్టు హాల్లోనే షూ విసిరిన ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఈ ఘటనను ఇప్పటికే విపక్ష పార్టీలతో పాటు ప్రధాని మోడీ, ఇతర బీజేపీ నేతలు ఖండించారు. అయినా ఈ కలకలం మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications