'అమరనాథ్' దాడి: సూత్రధారి అబూ ఇస్మాయిల్ హతం, మూడే నిమిషాల్లో ముగించేశారు
అమర్నాథ్ యాత్రికులపై జరిగిన కాల్పుల ఘటనలో కీలక సూత్రధారి, లష్కరే తోయిబా అగ్రనేత అబూ ఇస్మాయిల్ హతమయ్యాడు.
Recommended Video

శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికులపై జరిగిన కాల్పుల ఘటనలో కీలక సూత్రధారి, లష్కరే తోయిబా అగ్రనేత అబూ ఇస్మాయిల్ హతమయ్యాడు. శ్రీనగర్ శివారులోని నౌగమ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదులపై జరిపిన ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు ఇస్మాయిల్తో పాటు, అతని సహచరుడు చోటా అలియాస్, అబూ కాసింను మట్టుబెట్టాయి.
మొత్తం ఆపరేషన్ ను కేవలం మూడు నిమిషాల్లోనే భద్రతా బలగాలు ముగించినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ తో సిద్దమైనందువల్లే ఇంత త్వరగా ఆపరేషన్ పూర్తి చేయగలిగారని తెలుస్తోంది. ఇందుకోసం స్థానికుల నుంచి కూడా సహాయం తీసుకున్నట్లు సమాచారం.

కాగా, ఈ ఏడాది జులై 11న జమ్ము కశ్మీర్లోని అనంతనాగ్లో అమర్నాథ్ యాత్రికులపై జరిగిన కాల్పుల ఘటనలో అబూ ఇస్మాయిల్ కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఆ దాడిలో ఆరుగురు యాత్రికులు మృతి చెందారు. జమ్ముకశ్మీర్లో భారత భద్రతా బలగాల చేతిలో హతమైన టాప్ ఉగ్రవాదుల్లో ఇస్మాయిల్ నాలుగవ వాడు కావడం గమనార్హం.
కొన్ని నెలల క్రితం హిజ్బుల్ ముజాహిద్దీన్ లీడర్ బుర్హాన్ వనీ, మరో టాప్ లీడర్ సబ్జర్ భట్ను కూడా భారత భద్రతా బలగాలు హతం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో ఎల్ఈటీ కమాండర్ అబు దుజానాని కూడా భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications