ఒమిక్రాన్ భయాల మధ్య అంతర్జాతీయ వాణిజ్య విమానాల రద్దు జనవరి 31వరకు పొడిగింపు: డిజిసిఏ ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల మధ్య డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గురువారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశానికి వచ్చే, భారతదేశం నుండి వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సేవలను 2022 జనవరి 31 వరకు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ కార్గో కార్యకలాపాలు మరియు ప్రత్యేకంగా ఆమోదించిన విమానాలకు ఈ పరిమితి వర్తించదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.

అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సేవలపై డీజీసిఏ సర్క్యులర్
దేశంలో కరోనావైరస్ మహమ్మారి యొక్క అత్యంత వ్యాప్తి చెందగల ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందనే ఆందోళనల మధ్య ఈ ఆర్డర్ వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉన్నా అత్యధికంగా వ్యాప్తి చెయ్యగల అవకాశం ఉందని, డేంజరస్ ఉత్పరివర్తనలు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అప్రమత్తంగా ఉండాలని పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఈ మేరకు విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకుల విషయంలో ఆందోళన నెలకొనగా ఈ మేరకు రెగ్యులేటర్ గురువారం ఒక సర్క్యులర్ జారీ చేసింది.

అంతర్జాతీయ విమాన సర్వీసులు జనవరి 31 వరకు రద్దు
భారతదేశానికి మరియు భారతదేశం నుండి షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సేవలను నిలిపివేయడాన్ని జనవరి 31, 2022 వరకు పొడిగించాలని నిర్ణయించింది.డిసెంబర్ 15 నుండి షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ విమానాలు నడపడానికి అనుమతిస్తూ నవంబర్ 26న జారీ చేసిన సర్క్యులర్లో కేంద్ర విమానయాన సంస్థ కొత్త నిబంధనను స్వల్పంగా సవరించింది. ఒమిక్రాన్ వేరియంట్ దెబ్బకు డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ ఈ విమానాలపై నిషేధాన్ని ఎత్తి వేయాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని భారత్ కూడా భావించింది.

డిసెంబర్ 15 నుండి అంతర్జాతీయ విమానాలు నడపాలని జారీ చేసిన సర్క్యులర్ లో మార్పులు
భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్న కారణంగా డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరించాలని నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన డీజీసిఏ కొత్త తేదీలను తర్వాత తెలియజేస్తామని వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఒమిక్రాన్ ఆందోళనల మధ్య ఈ విషయం సమీక్షించబడిందని, ఈ మేరకు తాజాగా గత సర్క్యులర్ ను సవరిస్తూ ప్రకటన చేసింది
Recommended Video

అంతర్జాతీయ కార్గో సేవలు యధాతధం, కొనసాగనున్న నిర్ణయించిన రూట్లలో సర్వీసులు
డిసెంబరు 1న, దేశంలో ఒమిక్రాన్ కేసులు కనుగొనబడిన వెంటనే ఈ ఉత్తర్వును కొనసాగించకూడదని డీజీసిఏ నిర్ణయించింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా మార్చి 23, 2020 నుండి దేశంలో షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ ప్రయాణీకుల సేవలు నిలిపివేయబడ్డాయి. అయితే, మే 2020 నుండి వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు మరియు జూలై 2020 నుండి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక "ఎయిర్ బబుల్" ఏర్పాట్లలో పనిచేస్తున్నాయి. ఇక డిసెంబర్ 15 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలి అనుకున్నా ఒమిక్రాన్ దెబ్బకు మళ్ళీ తేదీ మార్చుకోవాల్సి వచ్చింది . ఇక అంతర్జాతీయ కార్గో సేవలకు ఈ నిర్ణయం వర్తించదని, అంతర్జాతీయ కార్గో సేవలు కొనసాగుతాయని డీజే పేర్కొంది. కేస్ టు కేస్ బేసిస్ లో ఇప్పటికే షెడ్యూల్ అయిన అంతర్జాతీయ విమానాలు ఎంపిక చేసిన రూట్లలో కొనసాగుతాయని వెల్లడించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications