చైనాపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరని, భారత్ భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఎవరూ తీసుకోలేరరన్నారు. అరుణాచల్ప్రదేశ్ తమ పరిధిలోకి వస్తుందని చైనా చెబుతోంది.
ఈ ప్రాంతంలో ఇండియా అధికార కార్యక్రమాలు నిర్వహించడమంటే తమ దౌశ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని చైనా అంటోంది. ఇండియా-చైనా మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో అమిత్ షా చైనా సరిహద్దు గ్రామమైన కిబితూలో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం(వీవీపీ)ను ప్రారంభించారు.

2014కు ముందు ఈశాన్య ప్రాంతమంతా అభివృద్ధికి దూరంగా.. అల్లకల్లోలంగా ఉండేదని, అయితే తమ ప్రభుత్వం చేపట్టిన లుక్ ఈస్ట్ విధానంతో భారతదేశ అభివృద్ధిలో ఈ ప్రాంతం కూడా భాగమైందని అమిత్ షా అన్నారు. కొత్తగా పేర్లు పెట్టినంత మాత్రాన భారత్లో భాగమైన అరుణాచల్ప్రదేశ్ను దేశం నుంచి వేరు చేయలేరంటూ పరోక్షంగా చైనాను ఉద్దేశించి అమిత్షా హెచ్చరించారు.
భారత సైనిక, సరిహద్దు భద్రతా దళాలను ఆయన ప్రశంసించారు. ఐటీబీపీ జవాన్లు, ఇండియన్ ఆర్మీ అహర్నిశలూ శ్రమిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని, జవాన్లు చేస్తున్న త్యాగం వల్లే దేశ ప్రజలంతా ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నారన్నారు. ఇండియాను చెడు దృష్టితో చూసే శక్తి ఎవరికీ లేదని గర్వంగా చెప్పగలమని అమిత్ షా వ్యాఖ్యానించారు.
-
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
చైనా బాటలోనే రష్యా-ఇరాన్ సుప్రీం లీడర్ కు భారీ ఊరట..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications