లింగాయతులకు ప్రత్యేక మతం ఇచ్చిన సిద్దూ: తెరమీదకు వీరశైవులు: అమిత్ షా ఆట !
బెంగళూరు: లింగాయతులకు ప్రత్యేక మతం, మైనారిటీ రిజర్వేషన్లు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చెక్ పెట్టడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సినిమా చూపించడానికి ఏప్రిల్ 3వ తేదీని అమిత్ షా ఫిక్స్ చేశారు. వీరశైవులను తెరమీదకు తెచ్చిన అమిత్ షా ఆట మొదలు పెట్టారు.
సిద్దరామయ్య తెలివి !
లింగాయతులకు ప్రత్యేక మతం, మైనారిటీ రిజర్వేషన్లు కల్పించాలని అంగీకరించిన సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి అమోదించాలని మనవి చేసింది. కర్ణాటకలోని లింగాయతుల ఓట్లు లాక్కొవడానికి ఎన్నికల ముందు సీఎం సిద్దరామయ్య తెలివిగా ప్రవర్తించారు.
బీజేపీ ఓటు బ్యాంకు
బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయతులు ఇప్పుడు ఎటువైపు మొగ్గుతారో అనే భయం ఆ పార్టీని పుట్టుకునింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బ తియ్యడానికి ఎన్నికల ఎత్తుల చాణుక్యుడు అమిత్ షా రంగంలోకి దిగారు.
ఒకే చోట 100 మంది స్వామీజీలు
ఇప్పటికే 40కి పైగా మఠాలకు తిరిగిన అమిత్ షా బాగల్ కోటే జిల్లాలోని బాదామి తాలుకాలోని శివయోగ మందిరానికి ఏప్రిల్ 3వ తేదీన వెలుతున్నారు. ఆరోజు 100 మందికి పైగా స్వాజీలతో అమిత్ షా మాట్లాడటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే లోక్ సభ సభ్వుడు ప్రహ్లాద్ జోషి అక్కడ సమావేశం నిర్వహించారు. శివయోగ మందిరానికి అమిత్ షా వస్తున్నారని శుక్రవారం ప్రహ్లాద్ జోషి మీడియాకు చెప్పారు.
వీరశైవులకు గాలం
ఉత్తర కర్ణాటకలోని నాలుగు జిల్లాల్లో అధికంగా వీరశైవ లింగాయతులు ఉన్నారు. వీరశైవ లింగాయతులకు శాసన సభ ఎన్నికల్లో గాలం వెయ్యాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎత్తులకు పైఎత్తులు వెయ్యడానికి అమిత్ షా సిద్దం అయ్యారు.
సీఎంపై రగులుతున్న వీరశైవులు
లింగాయతులకు ప్రత్యేక మతం, మైనారిటీ రిజన్వేషన్లు కల్పించిన సిద్దరామయ్య మీద వీరశైవ లింగాయతులు రగిలిపోతున్నారు. వీరశైవ లింగాయతులను బుజ్జగించడానికి వారికి ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య ప్రయత్నాలు చేస్తున్నారు.
సీఎం మీద యుధ్దభేరి
సీఎం సిద్దరామయ్య మీద యధ్దం చెయ్యడానికి బాగల్ కోటే జిల్లాలోని శివయోగ మందిరాన్ని అమిత్ షా వేదికగా చేసుకున్నారు. శివయోగ మందిరంలో 100 మందికి పైగా వీరశైవ లింగాయతుల స్వామీజీలు ఓకే సారి భేటీ కావడం, వారితో అమిత్ షా చర్చించనున్న నేపథ్యంలో కర్ణాటక శాసన సభ ఎన్నికలు మరింత వేడేక్కాయి.