అమ్రపాలి ఎక్స్ప్రెస్లో మంటలు: కాల్చిపారేసిన సిగరెట్టే కారణమా?
పాట్నా: అమ్రపాలి ఎక్స్ప్రెస్ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కటిహార్ రైల్వేయార్డులోని గుశల ర్యాక్ పాయింట్ వద్ద రైలు నిలిపి ఉంచిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.

రైల్వేయార్డులో నిలిపి ఉంచిన అమ్రపాలి ఎక్స్ప్రెస్లో పలువురు ప్రయాణికులు సేదదీరుతున్నారు. ఈ సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తి కాల్చి పారేసిన సిగరెట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
Fire breaks out in a coach of Amarpali Express in Railway yard in Bihar's Katihar pic.twitter.com/ajs1ar9Hpu
— ANI (@ANI) November 8, 2017
మంటల్లో ఒక బోగీ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications