బెంగళూరులో ఫ్లైఓవర్ మీద బైక్- ఇన్నోవా కారు ఢీ, 40 అడుగుల కిందపడి ఆంధ్రా యువకుడి మృతి!
బెంగళూరు/ నెలమంగల: ఫ్లైఓవర్ మీద వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ముందు వెలుతున్న బైక్ ను ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు బైక్ పడటంతో అందులో ప్రయాణిస్తున్న యువకుడు దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలైనాయి.
బెంగళూరు నగరం శివార్లలోని బెంగళూరు - తుమకూరు జాతీయ రహదారి 4 లోని నెలమంగల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తమకూరు వైపు వెలుతున్న బైక్ ను ఫ్లైఓవర్ మీద వేగంగా వెళ్లిన ఇన్నోవా కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో బైక్ 40 అడుగుల ఎత్తు నుంచి బైక్ కిందకు పడిపోయింది.

ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న సంజయ్ కుమార్ (25) అనే యువకుడి తలకు తీవ్రగాయాలై దుర్మరణం చెందాడు. బైక్ లో వెనుక కుర్చుని ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్రగాయాలైనాయి. ప్లైఓవర్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాయులు రికార్డు అయ్యాయని పోలీసులు అన్నారు. సంజయ్ కుమార్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణం అయిన కారు డ్రైవర్ ను అరెస్టు చేసి ఇన్నోవా వాహనం స్వాధీనం చేసుకున్నామని నెలమంగల పోలీసులు తెలిపారు. ఫ్లైఓవర్ మీద విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడపం వలనే నిత్యం ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని స్థానికులు ఆరోపించారు.
-
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications