నేను చచ్చిపోతే పార్టీ పరిస్థితేంటి: నేతలకు షాకిచ్చిన నితీష్
ఒకవేళ నేను చనిపోతే పార్టీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ నాయకులకు షాకిచ్చారు.
పాట్నా: ఒకవేళ నేను చనిపోతే పార్టీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ నాయకులకు షాకిచ్చారు.
జేడీయూ నేత నితీశ్ కుమార్ తాజాగా పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. సుమారు 215 మంది నాయకులు దీనిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీశ్ చేసిన వ్యాఖ్యలు సభ్యులను ఆశ్చర్యపరిచాయి.

ఒకవేళ నేను చచ్చిపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న మన ప్రభుత్వం నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ప్రజలకు సేవ చేయడం మానవద్దని పార్టీ నాయకులకు మార్గనిర్దేశనం చేశారు.
ముఖ్యమంత్రి అలా ఎందుకు అన్నారో ఎవరికీ అర్థం కాలేదు. అలాగే ఆయన ఆరోగ్యంపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. దీనికి సీఎం స్పందిస్తూ తాను ఆరోగ్యంగానే ఉన్నానని, మరో పదేళ్ల పాటు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు.












Click it and Unblock the Notifications