అఫ్జల్గురుపై వ్యాఖ్య: బీజేపీకి పీడీపీ చుక్కలు, అప్పుడే.. ముసలం!
శ్రీనగర్: పాకిస్తాన్, తీవ్రవాదులను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ పొగడి బీజేపీని ఇరుకున పెట్టారు. తాజాగా మరోసారి పీడీపీ అఫ్జల్ గురు పైన వ్యాఖ్యలు చేసి కమలం పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. పార్లమెంటు పైన దాడికి దిగిన అఫ్జల్ గురుకు చెందిన అస్తికలను వెనక్కి ఇవ్వాలని పీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
జమ్మూ కాశ్మీర్లో పీడీపీ - బీజేపీ ప్రభుత్వం ఆదివారం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన నాడే సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత ఎన్నికలకు తీవ్రవాదులు కారణమని చెప్పారు. ముఖ్యమంత్రి పాకిస్తాన్ పైన ప్రశంసలు కురిపించారని విపక్షాలు ధ్వజమెత్తాయి. దీనిని కాంగ్రెస్ పార్టీ... లోకసభలో బీజేపీ నిలదీసింది.
ఇప్పుడు బీజేపీతో పొత్తు కలిగిన పీడీపీకి చెందిన ఎమ్మెల్యే మరో సంచలన వ్యాఖ్య చేశారు. అఫ్జల్ గురుకు ఉరివేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అఫ్జల్ గురుకు చెందిన అస్తికలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బీజేపీకి రెండు రోజుల్లోనే మరో చిక్కు పడింది.

పాకిస్తాన్, తీవ్రవాదుల పైన తాను చేసిన వ్యాఖ్యలపైన పార్లమెంటు దద్దరిల్లినప్పటికీ ముఖ్యమంత్రి తగ్గలేదు. సరిహద్దుల్లో సైన్యం ఎప్పుడు ఉంటుందని మహ్మద్ ముఫ్తీ చెప్పారు. పాక్ పైన తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్ననని చెప్పారు. జమ్మూ సహా అన్ని సమస్యలు చర్చల ద్వారనే పరిష్కారమవుతుందని చెప్పారు. నా వ్యాఖ్యలపై మీడియా రాద్దాంతం చేస్తోంది. పాక్తో వాజపేయి విధానాలు కొనసాగాలని నాన్న కోరుకునే వారన్నారు.
పొత్తు.. అప్పుడే ముసలం!
జమ్మూ కాశ్మీర్లో బీజేపీ - పీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. అయితే అంతలోనే ముసలం ఏర్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీ తీరు పైన ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications