దేశంలో మరో ఎంపాక్స్ కేసు: కేరళలో కలకలం
తిరువనంతపురం: ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ (Mpox) వైరస్.. ఇప్పుడు భారతదేశంలోనూ కలవరానికి గురిచేస్తోంది. తాజాగా దేశంలో మరో కేసు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకు చేరింది. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది.
మలప్పురం జిల్లాకు చెందిన వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే ఎవరైనా మంకీపాక్స్ లక్షణాలు కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, త్వరగా చికిత్స పొందాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బాధితుడు ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి, తన కుటుంబం నుంచి ఐసోలేట్ అయ్యాడని తెలిపారు.

ప్రస్తుతం మంజేరి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడని మంత్రి తెలిపారు. అతడి నమూనాలను పరీక్షల కోసం పంపించగా.. మంకీపాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కాగా, దేశంలో సెప్టెంబర్ 9న తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలను పరీక్షించగా.. అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్-2 రకంగా నిర్ధరించిన విషయం తెలిసిందే.
ఎంపాక్స్, మశూచికి సంబంధించిన వైరల్ వ్యాధి. ఇది చర్మంపై దద్దుర్లు, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాల ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది దగ్గరి చర్మం నుంచి చర్మానికి సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకం అయినప్పటికీ నియంత్రించే అవకాశాలున్నాయి.
హర్యానాలోని హిసార్కు చెందిన 26 ఏళ్ల నివాసి వైరస్కు పాజిటివ్ పరీక్షించి, ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎల్ఎన్జెపి ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత గత వారం ఢిల్లీ నుంచి కొత్త ఎంపాక్స్ కేసు నమోదైంది. జూలై 2022 నుంచి భారతదేశంలో నమోదైన మునుపటి 30 కేసుల మాదిరిగానే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిని ఐసోలేటెడ్ కేసుగా వర్గీకరించింది.
హిసార్కు చెందిన 26 ఏళ్ల యువకుడు ఎంపాక్స్ వైరస్ పశ్చిమ ఆఫ్రికా క్లాడ్-2 బారిన పడ్డాడు. ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లో క్లాడ్ 1 ఎంపాక్స్ వ్యాప్తి కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ప్రస్తుత ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి ఈ కేసు సంబంధం లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications