గర్ల్ ఫ్రెండ్ తో యువకుడు: గుండు కొట్టిన యాంటీ రోమియో స్క్వాడ్ (వీడియో)
ఉత్తరప్రదేశ్ లో గర్ల్ ఫ్రెండ్ తో కలిసి పార్క్ లో కుర్చొని మాట్లాడుతున్న యువకుడిని నడిరోడ్డు మీదకు లాక్కొని వెళ్లిన యాంటీ రోమియో స్కాడ్ బృందం అతనికి పోలీసుల ముందే గుండు కొట్టడంతో ఆ వీడియో
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగానే బీజేపీ అధికారంలోకి వచ్చాక యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు పార్క్ లు, రోడ్ల మీద సంచరిస్తున్న యాంటీ రోమియో స్క్వాడ్ బృందాలు అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించే అకతాయిలకు బుద్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే అక్కడక్కడా యాంటీ రోమియో స్క్వాడ్ బృందాలు సృతిమించి ప్రవర్థిస్తున్నారని వెలుగు చూసింది. తన స్నేహితురాలితో కలిసి పార్క్ లో కుర్చోని ఉన్న యువకుడిని నడిరోడ్డు మీదకు లాక్కోని వచ్చి గుండు కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ఫూర్ నగరంలోని ఓ ఉద్యానవనంలో ఓ యువతీ యువకుడు కుర్చుకుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అటు వైపు వెళ్లిన యాంటీ రోమియో స్క్వాడ్ బృందం ఆ యువకుడిని నడిరోడ్డు మీదకు లాక్కొని వచ్చారు.
తరువాత నడిరోడ్డులో ముగ్గురు పోలీసుల ముందే ఆ యువకుడికి గుండు కొట్టారు. యాంటీ రోమియో స్క్వాడ్ బృందం యువకుడికి గుండు కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ సమయంలో అక్కడ పోలీసులు ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి.
యువకుడికి గుండు కొట్టే సమయంలో అడ్డుకోకుండా నిర్లక్షంగా వ్యవహరించిన సుహైల్ అహమ్మద్, సోనుపాల్, లోయెక్ అహమ్మద్ అనే ముగ్గురు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించామని షాజహాన్ఫూర్ నగర ప్రత్యేక ఎస్పీ కేబీ. సింగ్ మీడియాకు చెప్పారు. పోలీసుల ముందే ఆ యువకుడికి ఎలా గుండు కొట్టారో ఆ వీడియో మీరే చూడండి.