అనూహ్య కేసు: బైక్పై ఎలా వెళ్తుందని తండ్రి అనుమానం
ముంబై/విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో సిట్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనూహ్య తండ్రి మాత్రం కట్టుకథలా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనూహ్య ఒక అపరిచితుని వాహనంపై వెళ్లిందని పోలీసులు తేల్చడం నమ్మశక్యంగా లేదని తండ్రి ప్రసాద్ అంటున్నారు.
ముంబై పోలీసుల కథనం కట్టుకథలా ఉందన్నారు. అనూహ్య హత్యకు సంబంధించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏదో ఒక రకంగా కేసును మూసేసి, చేతులు దులుపుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆరోపించారు. అనూహ్యతో పాటు సిసిటివి పుటేజిలో కనిపించిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నా, నమ్మశక్యంగా లేదన్నారు.

సిసిటివి పుటేజిలో కనిపించిన వ్యక్తికి 40 ఏళ్లకు పైగా వయసు ఉంటుందని తొలుత పేర్కొన్న పోలీసులు ఇప్పుడు 28 ఏళ్లని చెబుతున్నారన్నారు. తన కూతురు ముక్కూముహం తెలియని వ్యక్తితో, బైక్పై వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారని, అనూహ్య బ్యాగ్, దుస్తులు, ల్యాప్టాప్ తదితర వస్తువులను సేకరించలేక పోయారన్నారు.
వస్తువులను యాచకులకు దానం చేశారనడం కూడా నమ్మశక్యంగా లేదని, నిందితుడితో ఒక్కమాట కూడా మాట్లాడించకుండా కట్టుకథ అల్లి మీడియాకు చెప్పినట్లుగా ఉందన్నారు. నిజమైన నిందితులను అరెస్టు చేయాలన్నారు. బ్యాగులో సామాను లేదని చెబుతున్నారని అన్నారు. పూర్తి ఆధారాలు లేవని ఆయన అభిప్రాయపడుతున్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications