ఇండియన్ ఆర్మీపై ఓంపురి సంచలన వ్యాఖ్యలు, విమర్శలు
ముంబై: భారత సైన్యాన్ని అవమానించినందుకు నటుడు ఓం పురి పైన మరో నటుడు అనుపమ్ ఖేర్ మంగళవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ఆర్మీ పైన ఓంపురి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కాగా, ఇండియన్ ఆర్మీ పైన ఓంపురి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
యూరి ఘటన నేపథ్యంలో ఓ జాతీయ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చలో ఓంపురి మాట్లాడాడు. భారత్లోని పాక్ నటులకు మద్దతుగా సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్ధిస్తున్నారా? అని అడగగా.. మీరు భారత్, పాక్లను శతాబ్దాలుగా కొట్టుకున్న ఇజ్రాయిల్- పాలస్తీనాలా చూడాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

ఇది దేశాలు విడిపోయే విషయం కాదు.. కుటుంబాలు విడిపోయే విషయమన్నారు. మన దేశంలో 22 కోట్ల ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం రెండో స్థానంలో ఉందని, ఇప్పటికీ నేను పాకిస్తాన్ నటులతో కలిసి పని చేస్తానన్నారు.
అదే సమయంలో బారాముల్లా, యూరి దాడుల్లో చనిపోయిన సైనికుల గురించి ప్రస్తావించగా.. వారిని సైన్యంలో చేరమని మనం బలవంతం చేశామా, ఎవరు ఆర్మీలో చేరి ఆయుధాలు పట్టుకోమన్నారని షాకింగ్ సమాధానం ఇచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications