విభజన: భారతరత్నకు పివి పేరు, సీమాంధ్రుల వినతి..!

పివికి భారతరత్న ఇవ్వాలంటూ సీమాంధ్రకు చెందిన కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రతిపాదించిన నేపథ్యంలో ఆయన పేరును రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. 1971-72లో జై ఆంధ్రా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినప్పుడు కూడా రాష్ట్రం సమైక్యంగానే ఉండాలన్న పట్టుదలతో పివి వ్యవహరించారని వారు అంటున్నారు.
దేశ ఆర్థిక రంగాన్ని మలుపుతిప్పిన ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా పివికి పేరుంది. మంచి తత్వవేత్త అని, రాజనీతిజ్ఞుడని, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచిన సంస్కరణల రూపశిల్పి అని, దేశ సమగ్రతకు కృషి చేశారని, అటువంటి పివిని భారతరత్నతో సత్కరించాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు.
ఈ నేపథ్యంలోనే పివి పేరును రాష్ట్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుకు సిఫారసు చేసిందంటున్నారు. రావు బాలసరస్వతి, దాశరథి రంగాచార్య పేర్లను కూడా పద్మ అవార్డులకు సిఫారసు చేశారు. జాబితాను పరిశీలించి వారిలో కొంతమందిని ఎంపిక చేసి కేంద్రం రాష్ట్రపతికి నివేదిస్తుంది. ఈ నెల 25న పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించనుంది. 26న రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేస్తారు.












Click it and Unblock the Notifications