వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత

|
Google Oneindia TeluguNews

రామేశ్వరం: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీరా లెబ్బాయ్ మరాయ్‌కయార్(104) ఆదివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రామేశ్వరంలో తన నివాసంలో తుద్విశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు.

కాగా, ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌కు ట్రస్టీల్లో మరాయ్‌కయార్ కూడా ఒకరు. కలాం పెద్దన్నయ్య మరణంతో రామేశ్వరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మహమ్మద్ ముత్తుమీర పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన నివాసంలోనే ఉంచారు.

 APJ Abdul Kalams elder brother Mohammed Muthu Meera passes away

మహమ్మద్ ముత్తీమార మరణం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

English summary
APJ Abdul Kalam's elder brother Mohammed Muthu Meera passes away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X