Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెసుకు పట్టు లేదు: జైట్లీ, మాటలు చాలవు: సింఘ్వీ

Arun Jailtey blames Congress for Loksabha incidents
న్యూఢిల్లీ: లోకసభలో గురువారం చోటు చేసుకుంటున్న సంఘటనలకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ కాంగ్రెసు పార్టీని నిందించారు. గురువారంనాటి సంఘటనలు ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చాయని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సమస్యకు కాంగ్రెసు పార్టీయే కారణమని ఆయన విమర్శించారు.

తన పార్లమెంటు సభ్యులపైనే కాంగ్రెసుకు పట్టు లేదని ఆయన అన్నారు. అరాచానికి దిగింది కాంగ్రెసువాళ్లేనని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎటువంటి సమస్య లేకుండా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయున గుర్తు చేశారు. పరిపాలన సాగించడంలో యుపిఎ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు నిట్టనిలువునా చీలిందని ఆయన అన్నారు.

కాంగ్రెసువాళ్లు సభలో కలబడడం దారుణమని కాంగ్రెసు సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు పార్టీ జరిగిన సంఘటనలకు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. పార్టీ పరిస్థితిని కాంగ్రెసు నాయకత్వం చక్కదిద్దుకోలేకపోతోందని ఆయన అన్నారు. వారి సభ్యులూ ఎంపీలే వెల్‌లోకి వెళ్తున్నారని ఆయన అన్నారు.

లోకసభలో జరిగిన సంఘటనను ఖండించడానికి మాటలు సరిపోవడం లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. రెచ్చగొట్టిన పరిస్థితులు లేకున్నా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అత్యంత విచారకరమైన సంఘటన అని ఆయన అన్నారు. జరిగిన సంఘటన అత్యంత బాధాకరంమని, క్షమార్హం కాదని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+