ఓ మంత్రి నాపై దాడికి యత్నించారు: గవర్నర్
ఈటానగర్: అరుణాచలప్రదేశ్ రాష్ట్ర మంత్రే స్వయంగా తనపై దాడికి ప్రయత్నించారని ఆ రాష్ట్ర గవర్నర్ జేపీ రాజ్ఖోవా ఆరోపించారు. ఈ మేరకు ఓ నివేదికను గురువారం మధ్యాహ్నం ఆయన ఓ సీల్డ్ కవర్ ద్వారా సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతల అంశాన్ని కూడా ఆయన ఆ నివేదికల ద్వారా సుప్రీంకు తెలియజేయనున్నారు.అప్పటి ముఖ్యమంత్రి నబమ్ టుకి మంత్రివర్గంలోని మంత్రులు గత డిసెంబరు 14న గవర్నర్ని కలిసేందుకు వెళ్లారు.

రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్ని ముందుకు జరపాలని గవర్నర్ వారికి సూచించారు. ఆ సందర్భంలో అక్కడున్న మంత్రి ఒకరు తనపై దాడి చెయ్యడానికి యత్నించారని రాజ్ఖోవా ఆరోపించారు. రాజ్భవన్ వచ్చే దారిని కూడా ముఖ్యమంత్రి మనుషులు మూసివేశారని చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు వివరిస్తూ జనవరి 18న రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కోరారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications