దయ చేసి ప్లే చేయండి: యాంకర్ను కోరిన కేజ్రివాల్
న్యూఢిల్లీ: తను ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఓ భాగాన్ని పదే పదే చూపాలని ఓ టీవి యాంకర్ను ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ కోరినట్లు ఉన్న వీడియో యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. ఇంటర్వ్యూ తర్వాత టీవి యాంకర్కు, అరవింద్ కేజ్రివాల్కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆ వీడియో నిమిషానికిపైగానే ఉంది.
ఆ సంభాషణలో తను ఇచ్చిన ఇంటర్య్వోలోని ముఖ్యమైన భాగానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. దయచేసి ఇంటర్వ్యూలో బాగా వచ్చిన ఆ భాగాన్ని పదే పదే ప్రసారం చేయాలని యాంకర్కు కేజ్రివాల్ విజ్ఞప్తి చేశారు.

అందుకు సమాధానంగా ఆ యాంకర్ బదిలిస్తూ.. ‘తప్పకుండా ప్రసారం చేస్తాం. భగత్ సింగ్ కామెంట్ చాలా బాగుంది. దీనిపై చాలా ప్రతిస్పందనలు వచ్చే అవకాశం ఉంది' అని చెప్పారు. అరవింద్ కేజ్రివాల్ ఈ ఇంటర్వ్యూని ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇచ్చినట్లు సమాచారం.
కాగా, ఇటీవల అరవింద్ కేజ్రివాల్ మీడియాపై విమర్శలు గుప్పించిన తర్వాతే ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన సంభాషణలు బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. పలువురి కుట్రలో భాగంగానే తనపై మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని అరవింద్ కేజ్రివాల్ ఆరోపణలు చేశారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications