Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పంజాబ్ ప్రజల విప్లవంపై అరవింద్ కేజ్రీవాల్; ఆప్ కు కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ అభినందనలు

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయానికి అత్యంత సమీపంగా ఉన్న తరుణంలో, ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ రాష్ట్రంలో 'విప్లవం' తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు అభినందనలు అని పేర్కొన్నారు. ధురి నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Recommended Video

    Punjab Election Results 2022: AAP Crosses Majority Mark In Early Trends | Oneindia Telugu

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల 2022 కౌంటింగ్ గురువారం జరుగుతుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అయింది. పంజాబ్ రాష్ట్రంలో పార్టీ ప్రత్యర్థి పార్టీలను తలదన్ని మ్యాజిక్ ఫిగర్ ను దాటి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఈ సందర్భంగా, పార్టీ కన్వీనర్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భగవంత్ మాన్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో ఇద్దరూ విజయ సంకేతాలను చూపిస్తున్నారు. కేజ్రీవాల్ పంజాబ్ ప్రజల విప్లవాత్మక తీర్పుకు పంజాబ్ ప్రజలకు అభినందనలు అని పేర్కొన్నారు.

    117 అసెంబ్లీ స్థానాల్లో 90 స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌ పరాజయం పాలయిందని, బీఎస్‌పీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్‌ఏడీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని ట్రెండ్‌లు సూచిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ, ఐదుసార్లు సీఎంగా పనిచేసిన ప్రకాష్ సింగ్ బాదల్ సహా పంజాబ్ రాజకీయాల్లోని ప్రముఖులంతా ఎన్నికలలో తీవ్రంగా వెనుకబడి ఊహించని విధంగా దెబ్బతిన్నారు.

    పంజాబ్‌ను ఇకపై 'ఉడ్తా పంజాబ్' డ్రగ్స్ మహమ్మారికి సూచనగా పిలిచేవారని, కానీ ఇక నుండి 'ఉడ్తా పంజాబ్' అంటే పంజాబ్ ప్రజల మేల్కొలుపు అని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఇన్‌ఛార్జ్ రాఘవ్ చద్దా గురువారం అన్నారు. ఫలితాలు 'ఆమ్ ఆద్మీ' విజయమని మనీష్ సిసోడియా అన్నారు. విద్యారంగంలో న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పనితీరును కొనియాడిన రాఘవ్ చడ్డా ప్రత్యర్థి పార్టీలు పరువు తీయడానికి ప్రయత్నం చేసినా ఆప్ అధినేత కేజ్రీవాల్ ను నమ్మారని పేర్కొన్నారు.

    Arvind Kejriwal congratulates people on revolution over AAP victory in Punjab

    అరవింద్ కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అని పిలిచారు. ప్రజలు ఆయన ఉగ్రవాది కాదని క్రమశిక్షణ వాది అని నిరూపించారని అన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌-భగవంత్‌ మాన్‌ జోడీ అంటే తమకు ఇష్టమని పంజాబ్‌ రుజువు చేసిందని, మరే ఇతర పార్టీల జోడీ ప్రజలకు నచ్చలేదని చద్దా తెలిపారు. ఇదిలా ఉంటే పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ ఆప్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజల స్వరం దేవుని స్వరం... పంజాబ్ ప్రజల ఆదేశాన్ని వినమ్రంగా అంగీకరిస్తున్నాం.. ఆప్‌కి అభినందనలు అని పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+