వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కారణమిదే?: కేజ్రీవాల్ కొన్నిరోజులపాటు మాట్లాడరు!
బెంగళూరు: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కొన్ని రోజుల వరకు ఎవరితోనూ మాట్లాడలేరు. ఎందుకంటే.. చాలా కాలంగా దగ్గు సమస్యతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్.. ఇటీవల బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీలో గొంతు సర్జరీ చేయించుకున్నారు.
కాగా, ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. కేజ్రీవాల్ గొంతుకు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించామని తెలిపారు. కేజ్రీవాల్ గొంతు పైభాగంలో చిన్న కండరానికి సర్జరీ చేసినట్లు తెలిపారు.
శస్త్ర చికిత్స కారణంగా కొన్ని రోజులపాటు మాట్లాడకుండా ఉండాలని ఆయనకు సూచించినట్లు తెలిపారు. ఆయన కోలుకునే పరిస్థితిని బట్టి ఎప్పటి నుంచి మాట్లాడవచ్చో చెబుతామని అన్నారు.
కేజ్రీవాల్ నాలుక సాధారణ పరిమాణం కంటే పెద్దగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన నోటి పరిమాణం కంటే నోటి పరిమాణం కంటే నాలుక కొంచెం పెద్దగా ఉందని చెప్పారు.
English summary
Delhi Chief Minister Arvind Kejriwal won't be talking for a while. He underwent a surgery for chronic cough at Narayana Health City in Bommasandra, Bangalore, on Tuesday.
Story first published: Thursday, September 15, 2016, 15:55 [IST]