Arvind Kejriwal: బెయిల్ కోసం కేజ్రీవాల్ పాట్లు, జైల్లో అవి తింటున్నారట!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. అంతేకాదు తినకూడనివి అన్నీ తింటున్నారు. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఇంతకు ఏం జరిగిందంటే..
కోర్టులో కేజ్రీవాల్ పిటీషన్.. నేడు విచారణ
అరవింద్ కేజ్రీవాల్ డయాబెటిస్ పేషెంట్ కావడంతో ఆయన చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్ డాక్టర్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన ప్రత్యేక కోర్టుకు ఈడి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన సంచలన ఆరోపణలు చేసింది.

కేజ్రీవాల్ ఫుల్ గా ఇవి తింటున్నారు: ఈడీ
కేజ్రీవాల్ అభ్యర్థనను వ్యతిరేకించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంటి భోజనానికి కేజ్రీవాల్ కు అనుమతి ఉండడంతో ఆయన తనకు ఇష్టమైన ఆహారపదార్థాలను తింటున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. డయాబెటిస్ పేషెంట్ అయినప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు , స్వీట్లు, ఆలూ పూరి వంటివి తింటున్నారని, షుగర్ లెవెల్స్ పెరిగే ఆహారాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగా తింటున్నారని, కేజ్రీవాల్ బెయిల్ కోసం ఇదంతా చేస్తున్నారని ఈడి ఆరోపించింది.
కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ హై..
జైల్లో కేజ్రీవాల్ కు రోజుకు రెండుసార్లు షుగర్ లెవెల్స్ చెక్ చేస్తున్నారని ఈడి వెల్లడించింది. ఏప్రిల్ 1వ తేదీన అరెస్టు చేసిన నాటి నుండి ఇప్పటివరకు జైల్లో ఆయన షుగర్ లెవెల్స్ రెట్టింపు అయ్యాయని ఈడి కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళింది. ఇక ఈడీ వాదనతో ఏకీభవించని కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఈడీ ఆరోపణలను ఖండించారు.
ఈడీ ఆరోపణలను ఖండించిన కేజ్రీవాల్ న్యాయవాది, కోర్టు ఏమందంటే
కేజ్రీవాల్ కు ఇంటి భోజనం రాకుండా చేయడానికి ఈ డి ప్రయత్నం చేస్తుందని అందుకే కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ధర్మాసనం అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించిన భోజనంతో పాటు, డైట్ చార్ట్ పై శుక్రవారం లోపు నివేదిక ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించారు . దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications